నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి.. ఆ బాధ్యత వర్మదే: పవన్ కళ్యాణ్..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి కోసం తన సీటును త్యాగం చేసిన వర్మను ఉన్నత స్థానంలో ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో కూటమి నేతలతో పవన్ సమావేశమై.. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిపి పనిచేయాలని పిలుపునిచ్చారు. వర్మ త్యాగం గొప్పదని కొనియాడారు. ప్రస్తుతం అందరూ కలసి రాష్ట్రాన్ని…

