AP

AP

యువ సైన్యాన్ని సిద్ధం చేసుకున్న జగన్: సారథిగా బైరెడ్డి

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.   ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల…

AP

రాజీనామాల వేళ.. జగన్ మెరుపు నిర్ణయం: సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్: కొత్త ఇన్‌ఛార్జీ నియామకం..

గ్రేటర్ విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి (Tippala Devan Reddy) రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తోన్నట్లు తెలిపారు.   సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడే దేవన్ రెడ్డి. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కల్యాణ్‌నే మట్టి కరిపించిన పేరును సాధించారు నాగిరెడ్డి. భారీ మెజారిటీతో పవన్‌ను ఓడించి, జెయింట్…

AP

వైసీపీలో మరో బిగ్ వికెట్ అవుట్..: ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ రాజీనామా: ఏం జరుగుతోంది..?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొంటోంది. ఇంకో నాలుగు నెలల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంపై దృష్టి సారించింది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఈ పరిస్థితుల్లో- గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియెజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆళ్ల…

AP

టీడీపీ తొలి జాబితా సిద్దం…

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీ-జనసేన పొత్తు వేళ అభ్యర్దుల పైన స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన నుంచి 50 అసెంబ్లీ -5 లోక్ సభ సీట్ల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. 30 అసెంబ్లీ -2 లోక్ సభ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ నుంచి 45 మందితో తొలి జాబితా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   చంద్రబాబు కసరత్తు: ఏపీలో ఎన్నికలు…

AP

చంద్రబాబుకు మంత్రి గోవర్ధన్ రెడ్డి సవాల్..!!

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మూడు నెలల తరువాత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పైన చేసిన విమర్శలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు.   టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సీరియస్‌…

AP

నిరుద్యోగులను మోసం చేయడానికే ఇప్పుడు నోటిఫికేషన్లు : టిడిపి నేత గంటా..

ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరుగనుండగా.. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం.. జగన్ ప్రభుత్వం వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అని తెలుగుదేశం సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం గ్రూప్-1,గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని గంటీ శ్రీనివాస్ తప్పుబట్టారు.   ఇన్ని సంవత్సరాల పాటు నిరుద్యోగులను మోసం చేసి సరిగ్గా ఎన్నికల ముందు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో జగన్ ప్రభుత్వం చేస్తున్న మరో మోసం అని చెప్పారు. అసలు…

AP

మూడు నెలల్లో ఏపీ ఎన్నికలు? తెలంగాణ ఎన్నికల తరువాత జగన్ వ్యూహం ఏమిటి..?

తెలంగాణలో కొత్త సభ కొలువుదీరింది. ఇక, ఏపీ సంగతేంటి? అక్కడి రాజకీయం రగులుతోంది. ఎప్పుడు ఎన్నికలొస్తాయో చంద్రబాబు చెప్పేశారు. ఎవరికి టికెట్లు ఇస్తానో కూడా క్లారిటీ ఇచ్చారు. మరి సీఎం జగన్ సంగతేంటి? సిట్టింగ్‌లకు మళ్లీ ఛాన్సిస్తారా? మారుస్తారా?   మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహరచన చేస్తున్నారు. జనసేనతో పొత్తుపై చాలా క్లారిటీతో ఉన్నారు చంద్రబాబు. సీట్ల పంపకాల మీద కూడా మాటలు నడిచాయి.…

AP

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. జనవరి 19కి వాయిదా..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జనవరి 19కు వాయిదా పడింది. ఈ పిటిషన్ పై గతంలోనే వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టింది.   స్కిల్ కేసులో 17…

AP

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 కు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్-1 కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.   డిప్యూటీ కలెక్టర్ -9, డీఎస్పీలు – 26 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవలసిన వారు https://psc.ap.gov.in ను చూడవచ్చు. ఏపీ సివిల్ సర్వీస్…

AP

అమెరికా కాదు అంతరిక్షం నుంచి వచ్చినా.. గుడివాడలో టీడీపీ ఎన్నారై ఇన్ ఛార్జ్ పై కొడాలి ఫైర్..

గుడివాడలో తనను ఓడించేందుకు టీడీపీ అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును ఇన్ ఛార్జ్ గా ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై కొడాలి ఫైర్ అయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రతి ఎన్నికలో డ్యూటీ ఎక్కి, దిగినట్లు ఒక అభ్యర్థి వచ్చి వెళుతూ ఉంటారన్నారు.   తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు అమెరికా నుండి కాదు…