AP

AP

జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుడ్‌న్యూస్ అందింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్‌ను మరోసారి కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం అందించింది.   ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రసాద్ అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్…

AP

మంత్రి రోజా సీటు గల్లంతేనట…?

మంత్రి ఆర్కే రోజా… ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని, జగన్ ఎలాగైనా తనకు టికెట్ కేటాయిస్తారని బలమైన విశ్వాసంతో ఉన్నారు. కానీ ఈసారి రోజాకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంత్రి రోజాను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగరి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న రోజాకు ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ టికెట్టు దొరకదని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.   అయితే వైసిపి హై కమాండ్ త్వరలో ఐదవ జాబితాను…

AP

మాజీ మంత్రి, వైసీపీ నేత ఇంటికి వైఎస్ షర్మిల….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కాలుపెట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఏపీలో బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుండే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల మరోవైపు తమతో కలిసి వచ్చే నాయకులను కాంగ్రెస్ పార్టీ బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే, మరొకపక్క ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై వైఎస్ షర్మిల ఫోకస్ పెట్టారు.   ఈరోజు విజయనగరం కాంగ్రెస్ పార్టీ…

AP

గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం..

టీడీపీకి ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాకిచ్చారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమర్పించిన రాజీనామాను ఇవాళ ఆమోదించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గంటా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. గంటా రాజీనామా సమర్పించి మూడేళ్లు కావస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం విశేషం.   విశాఖ ఉత్తరం సీటు…

AP

తొలగించిన అంగన్ వాడీ ఖాళీల భర్తీకి జగన్ సర్కార్ రెడీ- 25న నోటిఫికేషన్ ? |

ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్లు తమ జిల్లాల్లో సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించే ప్రక్రియ చేపట్టారు.   సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు,…

AP

ఏపీ రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ ఈసీ భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వీలుగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ భారీ ఎత్తున ఓట్లను చేర్పించే కార్యక్రమం చేపట్టాయి. ఇందులో నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈసీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా మొత్తం 5.6 లక్షల ఓట్లను తొలగించినట్లు ప్రకటించారు.   రాష్ట్రంలో తాజా సవరణ…

AP

ఏపీలో.. ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు: షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం..!

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో జాబితాపై కసరత్తు చేస్తోంది.   ఈ నెల 25వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీని తరువాత షెడ్యూల్…

AP

జనసేనలో చేరుతున్నా.. పవన్ కళ్యాణ్‌పై బాలశౌరి ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలోకి మరో సీనియర్ నేత చేరిక ఖాయమైంది. ఇటీవల అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలో మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు.   అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు తెలిపారు. పవన్ తో వివిధ అంశాలపై రెండు గంటలపాటు చర్చించినట్లు…

APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.

APCINEMA

త్వరలో ప్రజా సేవలోకి ప్రభాస్ – ఎన్నికల్లో పోటీ, కృష్ణంరాజు సతీమణి క్లారిటీ..!!..

కృష్ణంరాజు కుటుంబానికి ఎంపీ సీటు ఆఫర్ వచ్చింది. మూడు పార్టీల నుంచి కృష్ణంరాజు సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ ఎంట్రీ గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ భవిష్యత్ కార్యక్రమాల గురించి తేల్చి చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేసారు. ప్రభాస్ సైతం ప్రజాసేవలోకి వస్తున్నారని శ్యామల కీలక వ్యాఖ్యలు చేసారు.   రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు జయంతి కావటంతో కుటుంబ…