AP

AP

ఉచిత బస్సు ప‌థ‌కం… ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్‌డీఏ కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ ప‌థ‌కం ఒక‌టి. దాంతో ఈ స్కీమ్ అమ‌లు ఎప్పుడెప్పుడా అని మ‌హిళ‌లు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర‌ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.   ఈ ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల ప‌రిశీల‌న‌కై ప్ర‌భుత్వం కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రుల‌తో ఈ స‌బ్‌ క‌మిటీని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్త‌ర్వులు…

AP

తెనాలిలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి నాదెండ్ల..

క్రీడలను ప్రోత్సహిస్తూ తెనాలిలో సువిశాలమైన స్టేడియంను నిర్మించనున్నామని ఏపీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 1.76 ఎకరాల మున్సిపల్ భూమిని సేకరించి రూ. 3 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అందులోనే వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.   పట్టణ అభివృద్ధి కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణ, మెరుగైన వైద్య…

AP

ఏపీలో ఆరుగురు మంత్రులపై వేటు..

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించారు. ఇందులో.. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలతో పాటు కూటమి పదవులు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో ఆరుగురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వారిని సున్నితంగా మందలించారు. ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. కేబినేట్ నిర్ణయాల్ని వెల్లడించారు.   ఏపీ కేబినేట్ నిర్ణయాలు…

AP

పేర్ని జయసుధ గోడౌన్ లో 3 వేల బస్తాలు కాదు… 4,840 బస్తాలు మాయం: మంత్రి నాదెండ్ల..

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు.   మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై…

AP

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన షిప్ బియ్యం లెక్క తేలింది..! ఎంతంటే..?

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలతో సముద్రంలోనే నిలిపివేసిన స్టెల్లా ఫిష్ లో తనిఖీలు పూర్తి చేసిన అధికారులు.. అందులో రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సముద్రంలోకి పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. పవన్ ఎంట్రీతో మరింత అప్రమత్తమైంది. సముద్రంలో లోడింగ్ కోసం వేచియున్న నౌక దగ్గరకు వెళ్లిన అధికారులు.. దానిని పోర్టు నుంచి వెళ్లకుండా అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. దాంతో.. రేషన్ బియ్యం అక్రమ వ్యవహారం నిజమేనని…

AP

103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ నిర్మాణం: మంత్రి నారాయణ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సాయంత్రం 43వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు.   రాజధాని నిర్మాణాలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీని 103 ఎకరాల్లో భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు.. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి, టవర్ పై నుంచి అమరావతి…

AP

రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు..!

రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి 19వ తేదీకి వాయిదా పడింది. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారుల నోటీసుకు స్పందించిన నాని కుటుంబం తొలి విడతలో ఈ…

AP

శబరిమల సన్నిధానంలో భక్తుడి ఆత్మహత్య..!

కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. ఇప్పటివరకు 22 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.   మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు కిందటి నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని…

AP

ఏపీకి భారీ వర్ష సూచన..!

బంగాళాఖాతంలో అల్పపీడనాలు నాన్‌స్టాప్‌గా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నెల 7న ఒక అల్పపీడనం ఏర్పడగా.. ఈరోజు లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుంది. అయితే ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస అల్పపీడనాల కారణంగా కొన్ని జిల్లాల్లో నాన్‌స్టాప్‌గా వర్షాలు కురుస్తున్నాయి.   ప్రస్తుతం ఏర్పడే అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. బలపడిన తర్వాత తమిళనాడు వైపు వెళ్లే అవకాశం…

AP

పేర్ని నాని అనూహ్య నిర్ణయం – బియ్యం కేసు ఎఫెక్ట్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ పేర్ని నాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబం పైన కేసు నమోదు అయింది. అరెస్ట్ తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో, అజ్ఞాతంలోకి పేర్ని కుటుంబం వెళ్లింది. ఇదే సమయంలో పేర్ని నాని రాజీ ఫార్ములా తెర మీదకు తీసుకొచ్చారు. కేసు నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు.   బియ్యం కేసు…