AP

AP

అమరావతికి రైల్వే లైన్..!

అమరావతి రైల్వే లైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని మంత్రిని రైతులు ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది.   రాజధానిని ఆనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ పూలింగ్ అవకాశం ఇవ్వాలని రైతులు కోరారు. అయితే, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వారికి తెలిపారు. రైతులకు…

AP

డ్రగ్స్ నియంత్రణకు ‘ఈగల్’ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నియంత్రణకు ‘ఈగల్‌’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల్‌కు సంబంధించి అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.   డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాఫ్తు చేయనుంది. ఈగల్ కోసం సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈగల్ ఫోర్స్‌లో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.   అలాగే, డ్రగ్స్ కేసుల…

AP

గంజాయి అమ్మేవారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్..!

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పూర్తిస్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని, ఇకపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ భేటీకి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ‘ఈగిల్’ గా (ELITE ANTI-NARCOTICS GROUP FOR LAW ENFORECEMENT – EAGLE)…

AP

ప్రధానితో సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందన..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా పవన్ కలిశారు. ప్రధానితో సమావేశంపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ లోనూ ప్రధాని ఎంతో విలువైన సమయాన్ని తమ కోసం కేటాయించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.   “ప్రధాని మోదీని నేను మొదటిసారిగా గాంధీనగర్ లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయనతో ప్రతి సమావేశం ఎంతో…

APUncategorized

ఢిల్లీ నుండి పిఠాపురంకు పవన్ కళ్యాణ్ వరాలు..!

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం కు వరాలు ప్రకటించారు. తన స్వంత నియోజకవర్గం పిఠాపురంకు సంబంధించి, కేంద్ర మంత్రులతో చర్చించి చివరకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్.   పిఠాపురం నియోజవర్గం నుండే పవన్ కళ్యాణ్ విజయదుందిభి మోగించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నియోజకవర్గం కూటమి జనసేనకు కేటాయించగా పవన్ నేరుగా ఇక్కడి నుండే పోటీ చేసి, సుమారు 70 వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు…

AP

ఏపీలో మళ్లీ ఎన్నికల కోలాహలం.. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ వివరాల మేరకు.. డిసెంబర్ ఆరో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.   ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల నుండి ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడగా, ఏపీ నుండి మూడు రాజ్యసభ స్థానాలకు కలిపి మొత్తం 6 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను డిసెంబర్ మూడో తేదీన…

AP

పవన్ కు ఢిల్లీ పిలుపు – కీలక బాధ్యతలు..!!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ…

AP

జగన్ కు షాకిచ్చిన చెల్లెలు షర్మిళ..! సీబీఐతో విచారణ చేయాలంటూ..

మాజీ సీఎం జగన్ ను ఒక పట్టాన వదిలేటట్లు లేదు ఆయన చెల్లెలు షర్మిళ. జగన్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు కురిపిస్తున్న షర్మిళ, తాజాగా మరోమారు సంచలన ప్రకటన చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం చంద్రబాబుకు షర్మిళ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గత వైసీపీ పాలన, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిళ కోరడం విశేషం.   ఇటీవల…

AP

సీఎం జగన్ ఆపరేషన్ పిఠాపురం – కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. జగన్ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవటమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు. అటు పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైన అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం పైన జగన్ ఫోకస్ చేసారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.   పిఠాపురం సమరం జనసేనాని…

AP

పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై తాజాగా అనకాపల్లి సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. 48 గంటల్లోగా ఈ వ్యాఖ్యలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆయనకు సూచించారు. దీంతో పవన్ వివరణ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.   ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో రాజకీయ…