AP

AP

వైసీపీ మేనిఫెస్టోలో కీలకాంశాలు..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.   ఈ నెల 27వ తేదీన బస్సుయాత్ర ప్రారంభం కాబోతోంది. అదే రోజున కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. 28న నంద్యాల,…

AP

చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి ఫోన్లు ట్యాప్..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎంత సంచలనంగా మారిందో చూస్తున్నాం. ప్రతిపక్ష నేతల ఫోన్లను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకమైన అధికారులను దీనికి నియమించి వారి ఫోన్లను ట్యాప్ చేయించారంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు…

AP

పిఠాపురం నుంచే పవన్ ప్రచారం-మూడు రోజులు అక్కడే.. !

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం సీటు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27న పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రెగ్యులర్ గా వెళ్లేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇవాళ జనసేన నేతలతో చర్చించి ఆయన షెడ్యూల్ ఖరారు చేశారు.   ఈసారి ఎన్నికలకు తాను పోటీ…

AP

అభ్యర్థుల్లో చంద్రబాబు మార్క్ మార్పులు..

ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టిడిపి తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. అయితే గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల మార్పుకు సైతం చంద్రబాబు సిద్ధమవుతున్నారు.   చంద్రబాబు మార్క్ మార్పులు : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటివరకు తమ పార్టీ నుంచి 139 మంది అభ్యర్థులను ప్రకటించారు. 13 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల పనితీరు, ప్రజలతో మమేకమవుతున్న అంశాలను…

AP

ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం..

ఎన్నికలవేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ, జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ..అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీలోనే మకాం వేసారు. పొత్తులో బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. కొన్ని మార్పులు కోరుతున్న బీజేపీ నాయకత్వం..తుది జాబితా ప్రకటన చేయనుంది. అటు బీజేపీ నాయకత్వం ఏపీలో ఎన్నికల బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.   బీజేపీ తాజా అడుగులు…

AP

టిడిపి అభ్యర్థుల మూడో జాబితా సిద్ధం – అనూహ్య మార్పులు, లిస్టులో..!!

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలకు రంగం సిద్దమైంది. చంద్రబాబు ఈ రోజు లిస్టు విడుదల చేయనున్నారు. టీడీపీ తొలి రెండు జాబితాలో మొత్తం అసెంబ్లీ అభ్యర్థులనే ప్రకటించింది. తాజా లిస్టులో పార్లమెంట్ అభ్యర్థులతో పాటుగా పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేలా ప్లాన్ చేసారు. అయితే, జాబితాలో అనూహ్య నిర్ణయాలు కనిపిస్తున్నాయి. బిజెపితో పొత్తులో భాగంగా కేటాయించిన ఎంపీ సీట్ల పైన కొత్త అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు ప్రకటించే టిడిపి జాబితాలో కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి.…

AP

టీడీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత..?

సార్వత్రిక ఎన్నిల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. . వచ్చే ఎన్నికల్లో పనబాక లక్ష్మి ఎంపీ సీటును ఆశిస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు. పైగా పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. దీనికి తోడు సర్వేల్లో పనబాక లక్ష్మి వెనుక పడటంతో ఈసారి చంద్రబాబు ఆమెకు టికెట్ నిరాకరించారని…

AP

ఏపీలో నా మద్దతు ఆ పార్టీకే- తేల్చేసిన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ..!

ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకీ, విపక్ష కూటమి ఎన్డీయేకూ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇద్దరూ ఎవరికి వారు ప్రజల్లో తమకే మద్దతుందని చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీగా సభలు ఏర్పాటు చేసి ప్రజామద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. అలాగే క్షేత్రస్ధాయిలో చిన్నా చితకా నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఫైనల్ గా ఈసారి ఎన్నికల్లో విజయం కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకునేందుకు రెడీగా ఉన్నారు.   ఈ నేపథ్యంలో ఒకప్పుడు…

AP

ఏపీలో విపక్ష కూటమికి ఈసీ భారీ ఊరట-కీలక ఆదేశాలు జారీ..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ప్రతీ విషయంలోనూ పోటాపోటీ వ్యవహారాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్దాయిలో అన్ని పార్టీలకు ఎన్నికల్లో పోటీ, ప్రచారం, ఇతరత్రా అంశాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. అయినా చాలా సార్లు ఈ మాటలు అమలు కావడం లేదు. కానీ ఇవాళ ఏపీలో మాత్రం ఎన్నికల సంఘం ఓ కీలక అంశంలో మాత్రం విపక్షాలకు ఊరటనిచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.   ఎన్నికల నేపథ్యంలో…

AP

టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారు: అంబటి రాంబాబు..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన తెలుగుదేశం-జనసేన- బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ ప్రజాగళం విఫలం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. టీడీపీ కూటమి జనంలో ఆదరణ కోల్పోయిందనడానికి ప్రజా గళం నిదర్శనమని, ప్రజలు తమ వెంటే ఉన్నారనడానికి ఆ సభే ఉదాహరణ అని అన్నారు.   తనపై వైఎస్‌ఆర్సీపీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు చెప్పుకొంటోన్నాడని, నిజానికి ఆయనే ఓ పెద్ద మానిప్యులేటర్…