AP

AP

ఆయేషా మీరా తల్లిదండ్రులకు విజయవాడ సీబీఐ కోర్టు నోటీసులు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సీబీఐ కోర్టు పంపిన నోటీసులను స్వీకరించేందుకు ఆయేషా తల్లిదండ్రులు నిరాకరించారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న తమను పదేపదే కోర్టుల చుట్టూ తిప్పడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.   వివరాల్లోకి వెళితే, కేసులో నిందితుడిగా ఉన్న పిడతల సత్యంబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం),…

AP

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం: మంత్రి నాదెండ్ల.

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలన్నీ ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.…

AP

మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌ చిక్కు.. వివాహిత అభ్యర్థులకు కొత్త నిబంధన..

మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో కీలకమైన సర్టిఫికెట్ల పరిశీలన దశలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ అనూహ్యమైన నిబంధన విధించడంతో వారిలో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.  …

AP

నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు..

“మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దర్జాలు, ఆర్భాటాలు ప్రదర్శించడం కుదరదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అహంకారం, అవినీతి, అలసత్వం వంటివి దరిచేరనివ్వొద్దని గట్టిగా సూచించారు.   బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో ఆయన మాట్లాడుతూ, తన ఆలోచన, మిత్రపక్ష…

AP

తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు..! అసలు కారణం అదేనా..?

గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ విషాద ఘటనలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.   గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ వద్దకే వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు, మోతాదుకు…

AP

ప్రజలకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..! ఇక నుండి ఇంటి వద్దకే ఆ సేవలు..!

ప్రజలకు శుభవార్త చెప్పనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు సర్కార్, కొత్త ప్లాన్ చేస్తోంది. ఇకపై కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అక్టోబరు 2 నుంచి ఇంటికే వారి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఇంటికి పంపేందుకు చర్యలు చేపట్టింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.   విద్యార్థులు పాఠశాల మారాలన్నా.. స్కాలర్ షిప్‌లకు…

AP

ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో వ‌ద్దు.. హైకోర్టులో పిల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించడం వివాదంగా మారింది. ఈ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. చట్టపరమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం చిత్రాన్ని కార్యాలయాల్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.   వివరాల్లోకి వెళితే.. వై. కొండలరావు అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోను పెట్టేందుకు…

AP

ఎరువులు అక్రమంగా నిల్వచేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయండి: మంత్రి నాదెండ్ల..

రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

AP

4 కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కారు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల పదవుల పందేరం కొనసాగుతోంది. ఇటీవల 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం, తాజాగా మరో నాలుగు కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించింది.   ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు 16 మంది, వెనకబడిన తరగతుల సహకార సంఘానికి ఐదుగురు, కమ్మ కార్పొరేషన్‌కు 15 మంది, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

AP

తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన..! కేంద్రం ఆమోదం..

తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత హోదా కల్పించింది. ఈ మేరకు రైలును క్రమబద్ధీకరించి రెగ్యులర్ రైలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.   ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పంపారు.  …