AP

AP

జగన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్..!

విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని ఆయన…

AP

మంగళగిరిలో త్వరలోనే రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీ… మంత్రి నారా లోకేశ్ సమీక్ష..

మంగళగిరి నియోజకవకర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి విడతగా సుమారు 3 వేల మందికి శాశ్వత…

AP

బుగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి .. ఏపీ సర్కార్‌కు నోటీసులు..

బుగ్గమఠం భూముల వివాదంపై వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం కార్యనిర్వహణ అధికారి (అసిస్టెంట్ కమిషనర్) జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెల 22న ఉత్తర్వులు జారీ…

AP

ఏపీలో రేషన్ సరకుల పంపిణీలో మార్పులు..!

రేషన్ సరకుల వ్యవహారం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులకు బదులుగా ఇంటివద్దకే వాహనంలో వచ్చి సరకులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు ఏడాదిగా అదే పద్ధతి కొనసాగించారు. కానీ ఇప్పుడు రేషన్ వాహనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే మార్పులపై ఇప్పుడు చర్చ మొదలైంది. రేషన్ వాహనాలు నిలిపివేయడం సంచలన నిర్ణయమే. ఇప్పటి వరకు ఇంటి వద్దనే, లేదా వీధి…

AP

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం.. 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు..

ఏపీలోని కూట‌మి ప్రభుత్వం ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఎన్‌టీఆర్ భ‌రోసా పింఛన్ల పథకంలో భాగంగా స్పౌజ్ కేటగిరీ కింద 71, 380 మందికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు.   సామాజిక భ‌ద్ర‌త పింఛ‌ను తీసుకుంటున్న భ‌ర్త చ‌నిపోతే… అత‌ని భార్య‌కు ఆ త‌దుప‌రి నెల నుంచే పింఛ‌ను అందించేలా స్పౌజ్ కేటగిరీని…

AP

ఫ్యాన్ లేదు.. లాక‌ప్‌లో దోమ‌లు కుడుతున్నాయి: కోర్టులో నందిగం సురేశ్ పిటిష‌న్..

తుళ్లూరు పీఎస్ లాకప్‌లో ఫ్యాన్ లేకపోవ‌డంతో దోమ‌లు కుడుతున్నాయ‌ని మంగ‌ళ‌గిరి కోర్టులో నందిగం సురేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. లాక‌ప్‌లో ఫ్యాను, దోమ‌ల మందు వినియోగించుకునేందుకు అనుమతించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై గురువారం మంగ‌ళ‌గిరి కోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి.   తుళ్లూరు సీఐ శ్రీనివాస‌రావు కోర్టుకు హాజ‌రయ్యారు. లాక‌ప్ రూమ్‌లోకి ఫ్యాన్‌, పొగ‌వ‌చ్చే దోమ‌ల మందులు, విద్యుత్ దీపాల‌ను వినియోగించ‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వ‌ని న్యాయ‌స్థానానికి వివ‌రించారు. లాక‌ప్ బ‌య‌ట నుంచి గాలి వ‌చ్చేలా టేబుల్…

AP

మీ ఆటలు ఇక సాగవు: సీఎం చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండవ రోజు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పల్నాడు, ప్రకాశం జిల్లాలలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేతల హత్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.   ఈ హత్యలపై తనకు అనుమానం వచ్చిందని ఆయన అన్నారు. తాను ఇప్పుడు ఎవరినీ నమ్మడం లేదని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని మనసులో అనుమానంతో ఆలోచిస్తే, కొందరు మన దగ్గరే ఉంటూ వారికి కోవర్టులుగా…

AP

జూన్ 4న వెన్నుపోటు దినం విజయవంతం చేయాలంటూ సజ్జల కామెంట్స్..!

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని ‘వెన్నుపోటు దినం’గా నిర్వహించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి…

AP

ఎన్టీఆర్ జయంతి ఇకపై రాష్ట్ర పండుగ.. ప్రభుత్వ అధికారిక ప్రకటన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి సంవత్సరం మే 28న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   ఎన్టీఆర్ రాష్ట్రానికి అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తుచేసుకుంది. ఆయన అసాధారణమైన జీవితం, దూరదృష్టితో కూడిన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌పై చెరగని ప్రభావం చూపాయని కొనియాడింది.…

AP

జూన్ 9 నుంచి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన..

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.   22 రోజులపాటు పర్యటన వైఎస్ షర్మిల చేపట్టనున్న ఈ రాష్ట్రస్థాయి పర్యటన…