AP

AP

రేపటి నుంచే ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రేపటి నుంచి (ఏప్రిల్ 1) రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. చేనేత రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ‘పవర్’ గిఫ్ట్…

AP

ఇక‌ ప్రతి నెల 4వ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత హెల్త్ క్యాంపులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కీల‌క‌ నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతి నెలా 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని…

AP

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) రెన్యూవల్‌పై హర్షం: కదిరిలో క్రికెటర్ల కేక్ కటింగ్ వేడుకలు

RDT FCRA రెన్యూవల్ పట్ల క్రికెటర్ల హర్షం ఇటీవల ఉమ్మడి జిల్లాలకు వరం లాంటి ఆర్డీటీ సంస్థకు ( FCRA ) లైసెన్స్ రెన్యూవల్ అవడం తో ప్రతి ఒక్కరు హర్షించారు.అందులో భాగంగా ఈరోజు ప్రభుత్య డిగ్రీ కళాశాల మైదానం నందు గల క్రికెట్ నెట్స్ నందు కదిరి వర్ధమాన, పూర్వ క్రికెటర్లు, క్రికెట్ శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి ఆనందం పంచుకొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ కదిరి రీజియన్ RD రఘురామ్, నల్లచెరువు ఏరియా ATL…

AP

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికేనా..?

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికి చేరినట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని కూటమి సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా మరోసారి ఏపీ ప్రజలు రాజధాని లేకుండా ఇబ్బందులు పడరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిపి ఆ బిల్లును సభలోని సభ్యులు ఆమోదించారు. అయితే, అమరావతి బిల్లు…

AP

రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహ ప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం.   నేడు పంపిణీ చేసిన ఇళ్లలో 1,00,875 టిడ్కో (TIDCO) గృహాలు ఉండగా, మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గతేడాది…

AP

సౌత్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన కదిరి విద్యార్థులు

ఆదివారం అనంతపురంలో అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కదిరి విద్యార్థులు కథస్ ఈవెంట్లో 10 మంది విద్యార్థులు పాల్గొని విజయభేరి ముగించారు వారిలో 6 మంది గోల్డ్ మెడల్ సాధించగా 4 గురు సిల్వర్ మెడల్ సాధించారు వారిలో బ్రౌన్ బెల్ట్ విభాగంలో అసద్ గోల్డ్ మెడల్ సాధించగా నాజిష్ సిల్వర్ మోడల్ సాధించాడు బ్లాక్ బెల్ట్ విభాగాలలో హానిక రాయల్. భవ్య గోల్డ్ మెడల్ సాధించారు…

AP

కదిరి ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగులకు ఊరట: మెట్ల బాధ తప్పిస్తూ ‘వాలు వంతెన’ ప్రారంభించిన ఇన్-చార్జి డిఎం రామకృష్ణ!

కదిరి:- ఆర్టీసీ బస్టాండులో దివ్యాంగుల కొరకు మెట్ల వాలువంతెన ఏర్పాటు:- రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు తేది: 18.3.2026 నుండి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం నకు అనుమతి ఇచ్చినది. తద్వార రోజు వందల మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్టాండుకు విచ్చేసి,ప్రయాణం చేస్తున్నారు. మరియు ఆర్టీసీ బస్టాండులో వున్న డిఎం ఆఫీసుకు రోజు వచ్చే దివ్యాంగులతో పాటు పదవీ విరమణ పొందిన ఆర్టీసి విశ్రాంత ఉద్యోగులకు బస్టాండు ఎంట్రన్స్ లో మెట్లను ఎక్కే బాధవుండేది. ఈ…

AP

అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుకూలమో, వ్యతిరేకమో వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై చారిత్రక తీర్మానం చేసేందుకు శనివారం నిర్వహించిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన సమావేశం జరుగుతుంటే, ప్రతిపక్ష నేత జగన్ బెంగళూరులో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత అంశం…

AP

అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ…-: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని… అది అమరావతేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అజేయం, అద్భుతం, అజరామరమని అభివర్ణించారు. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని పునరుద్ఘాటించారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ అని, రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అభివర్ణించారు.   అమరావతికి చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన…

AP

అరటి తోటకు నిప్పు.. 6 వేల చెట్లు అగ్నికి ఆహుతి..

  ఓబులవారిపల్లి మండలంలోని పెద్దఓరంపాడు గ్రామంలో ఆకతాయిలు నిప్పుపెట్టడంతో 5 ఎకరాల అరటి తోట దగ్ధమైంది. వల్లూరుపల్లికి చెందిన కొత్త పిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతులకు చెందిన 6 వేల అమృతపాణి రకం అరటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. డ్రిప్ పైపులు, ఇతర పరికరాలు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి…