AP

AP

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల-మోసం చేసే వాడే మోడీ అన్న షర్మిల..

గతంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దాన్ని అమలు చేసేదీ తామేనంటోంది. ఈ మేరకు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేసింది. తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని తెలిపింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ప్రకటన చేశారు. ఈ సభలో రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.  …

AP

వైసీపీ 9వ జాబితాలో సంచలనాలు-అనూహ్యంగా సాయిరెడ్డికి- మంగళగిరిలో మళ్లీ మార్పు..

వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఇవాళ 9వ జాబితాను సీఎం జగన్ విడుదల చేశారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికతో పాటు మంగళగిరి అసెంబ్లీ స్దానంలో మరోసారి ఇన్ ఛార్జ్ మార్పు ఉండటం సంచలనంగా మారింది. వైసీపీ ఇవాళ ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల జాబితాలో కేవలం మూడు…

AP

మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ కక్ష సాధింపే… వైసీపీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు..

మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు తెలుగుదేశం దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని విమర్శించారు. శరత్ అక్రమ అరెస్టును…

AP

ఎన్నికల్లో అభ్యర్థుల కోసం షర్మిల ఇంటర్వ్యూ..

ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కైనా సవాలే. అన్ని రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని దక్కించుకోవడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన విజయం దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ప్రజల మెప్పు పొందిన వారికే అధికారం లభిస్తుంది. లేకుంటే ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావలసి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని అనుకోదు. ఎందుకంటే అధికారం అనేది చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు. దేన్నైనా శాసించవచ్చు. ప్రస్తుతం…

AP

టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు.. కీలక పరిణామం.

ఏపీలో పొత్తుల అంశం కీలక మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం,జనసేన ఒక తాటి పైకి వచ్చాయి. కలిసి అభ్యర్థులను ప్రకటించాయి. టిడిపి 94, జనసేన ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బిజెపి అగ్ర నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లి వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై చర్చలు జరిపారు. బిజెపి చంద్రబాబుకు కీలక…

AP

7 లక్షలమందితో టీడీపీ- జనసేన ఉమ్మడి సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ఎన్నికల రణభేరిని మోగించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.   పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశాయి టీడీపీ-జనసేన. దీనికి తెలుగు జన విజయ కేతనం…

AP

వైసీపీలో ఇంఛార్జీల మార్పు.. 8వ జాబితా విడుదల..

అసెంబ్లీ ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు జాబితాలను ప్రకటించిన వైసీపీ.. తాజాగా మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది.   పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంఛార్జీలుగా ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ…

AP

వైసీపీకి గుడ్ బై చెప్పనున్న రాయలసీమ మంత్రి..

ఏపీలో ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు మరో వారం, పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆ లోపు తమకు సీటు కేటాయించే పార్టీలోకి వెళ్లి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత తలెత్తిన పరిస్ధితుల్లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీలు ఫిరాయిస్తుండగా.. ఇప్పుడు ఓ మంత్రి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.   ఏపీలో వైసీపీ…

AP

అమరావతి రైతులకు హైకోర్టులో భారీ ఊరట..!

ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఇక్కడ రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు వీలుగా రైతులకు సీఆర్డీయే ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. వీటిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులకు ఇవాళ ఊరట లభించింది. ఈ నోటీసుల్ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో కేటాయించిన విధంగా యథాతథంగా వారికి ఈ ప్లాట్లు కొనసాగుతాయి.   గతంలో భూసమీకరణ కింద…

AP

ఏపీ స్పీకర్ సంచలనం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు.   ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని అధికార వైయస్సార్…