ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల-మోసం చేసే వాడే మోడీ అన్న షర్మిల..
గతంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దాన్ని అమలు చేసేదీ తామేనంటోంది. ఈ మేరకు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేసింది. తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని తెలిపింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ప్రకటన చేశారు. ఈ సభలో రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు. …