AP

AP

చంద్రబాబు కేసుల్లో వాట్ నెక్స్ట్ – నేడే కీలకం, ఉత్కంఠ..!!.

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన సుప్రీం తీర్పు వెలువరించింది. 17ఏ పైన మాత్రం ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. అరెస్ట్, రిమాండ్ విషయంలో చంద్రబాబు వాదనతో ఏకీభవించలేదు. ఈ రోజు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.   ఫైబర్ కేసులో తీర్పు: చంద్రబాబు స్కిల్…

AP

ఎంపీ బెల్లాన దారెటు..?

అభ్యర్ధుల మార్పులు చేర్పులతో ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. నాలుగో జాబితా మీద ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. అన్ని లెక్కలను, సర్వేలనూ ముందేసుకొని ఎవర్ని ఉంచాలో? ఎవర్నీ పక్కనపెట్టాలో? అన్నదానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగుల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఫోర్త్ లిస్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లా నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లానకి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది..? దానిపై సదరు ఎంపీ…

AP

రాజన్న బాణంలా దూసుకొస్తున్న షర్మిల..!

ఏపీ కాంగ్రెస్‌లో అనుకున్నదే జరిగింది. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. పీసీసీ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినప్పుడే ఆమెకు లైన్ క్లియర్ అయింది. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేయకుండా షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక ఇప్పుడు రాష్ట రాజకీయాల్లో.. అది కూడా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా యాక్టివ్ అవ్వనున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కార్యాచరణ ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.   వైఎస్ షర్మిలకు…

AP

చంద్రబాబు స్కిల్ కేసుపై తీర్పు..

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ టీడీపీ నాయకుల్లో నెలకొంది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు తరఫు లాయర్లు, అవినీతి కేసుల్లో ఈ నిబంధన వర్తించదని సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించిన విషయం విధితమే.

AP

ఒంగోలు ఎంపీగా పోటీ, వైసీపీలో రాజీనామాల పర్వంపై మౌనం వీడిన వైవీ సుబ్బారెడ్డి..

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు విడతల్లో 59 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.   తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40…

AP

‘అమరావతి’కి గుడ్ న్యూస్..

భారతీయ రైల్వే ప్రయాణికులకు, ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు మంచి శుభవార్త. కొన్నాళ్లుగా విజయవాడ నుంచి హుబ్లీ మధ్య నడుస్తోన్న అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును నర్సాపూర్ వరకు పొడిగించారు. ఈ పొడిగించిన రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. విజయవాడ-నరసాపూర్ మధ్య డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి.   వాస్తవానికి అమరావతి ఎక్స్ ప్రెస్ ను గత నవంబరు నుంచే నరసాపూర్ నుంచి నడుపుతున్నారు. అప్పట్లోనే కిషన్ రెడ్డిచేత ప్రారంభించడానికి…

AP

సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ; ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సమయంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్‌ జడ్జి పోస్టుల(జూనియర్‌ డివిజన్‌)ను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది.   సివిల్‌ జడ్జి పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు చూస్తే 39 పోస్టులు…

AP

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా.. జనసేనలోకి ఎంట్రీ ఖరారు..!

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి వైయస్సార్సీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్న బాలశౌరి గత కొంత కాలంగా పార్టీ…

AP

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఖరార్..డజను హామీలు

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు లోక్‌సభ/అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్‌‌ఛార్జీలను ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది.   పలు అంశాలు..   సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం- జనసేన పార్టీలు సాగిస్తోన్న కసరత్తు కూడా దాదాపుగా ముగింపుదశకు చేరుకుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే ఈ జాబితాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. దీనికి సమాంతరంగా-…

AP

చంద్రబాబు ఇంటికి షర్మిల- దశాబ్దాల వైరంలో బిగ్ టర్న్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు స్నేహితులుగా, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్ధులుగా హోరాహోరీగా తలపడిన వైఎస్, చంద్రబాబు ఎపిసోడ్ కు హెలికాఫ్టర్ ప్రమాదం తర్వాత తెరపడింది. దీనికి ముందు వైఎస్, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, బయటా చేసుకున్న విమర్శలు, టార్గెట్ చేసుకున్న తీరు ఏపీ రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించేసింది. విభజన తర్వాత ఇప్పటికీ అసెంబ్లీలో వైఎస్, చంద్రబాబు స్ధాయి పోరు అధికార, విపక్షాల మధ్య కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.   అలా గతంలో…