ఏపీలో కరోనా వ్యాప్తి… కొత్తగా మరో మూడు కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, వైద్యులు ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.…