AP

AP

ఏపీలో కరోనా వ్యాప్తి… కొత్తగా మరో మూడు కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.…

AP

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్..?

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి (వర్కింగ్ ప్రెసిడెంట్) బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ పార్టీలోని మంత్రులు, సీనియర్ నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై మహానాడులో అధికారికంగా ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ లోకేశ్ తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు.   మహానాడులో పాల్గొనేందుకు కడపకు…

AP

పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాలపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.   “ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో…

AP

మాజీ మంత్రి కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు .. నేడు కోర్టు ముందుకు..

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను ఈరోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో అరెస్టు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరుకు తీసుకువచ్చారు.   జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన్ను ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. కిలోమీటరు దూరంలోనే అన్ని వాహనాలను నిలుపుదల చేస్తున్నారు.…

AP

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్ట్..

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కాకాణిని కేరళలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదు అయ్యింది.   అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా గత రెండు నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. కాకాణి గత వైసీీపీ ప్రభుత్వ…

AP

లిక్కర్ స్కామ్.. కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్..!

ఎట్టకేలకు మద్యం కుంభకోణంపై నోరు విప్పారు మాజీ సీఎం జగన్. రేపో మాపో ఆయన అరెస్టు అవుతారన్న వార్తల నేపథ్యంలో వాటిపై ఆసక్తికర స్టేట్‌మెంట్ చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని తేల్చేశారు. ఆయనకు ఆయనే క్లీన్‌చిట్ ఇచ్చుకున్నారు. తప్పంతా చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎదురుదాడి మొదలుపెట్టారు.   భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్షాలు సృష్టించి అరాచకంగా ప్రభుత్వం వ్యవహారి స్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తనను బెదిరిస్తుందని చెబుతూ ఏపీ బేవరేజెస్ మాజీ…

AP

జగన్‌కి కౌంటర్, తారకరత్న భార్య పోస్టు.. సాయిరెడ్డికి మద్దతుగా..

ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత మాజీ సీఎం జగన్‌కు అతికినట్టు సరిపోతుంది. కోర్ టీమ్ ప్లాన్‌తో నమ్మినబంటు విజయసాయిరెడ్డిని జగన్ దూరం చేసుకున్నారు. దాని పర్యవసానాలు ఇప్పుడిప్పుడే జగన్ అర్థమైనట్టు కనిపిస్తోంది. దాన్ని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి విజయసాయిరెడ్డిని టార్గెట్‌గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తన బాబాయి విజయసాయిరెడ్డికి మద్దతుగా ఆసక్తికరమైన పోస్టుపై చర్చ జరుగుతోంది.   ఇదీ అలేఖ్య…

AP

వైఎస్ జగన్ మీడియా సమావేశం..! కారణం అదేనా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి మాట్లాడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైఎస్సార్‌సీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రజలకు కొన్ని కీలక సందేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేసిన…

AP

నూతన రేషన్ విధానంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియను నిలిపివేసి, తిరిగి చౌకధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…

AP

జగన్ 2.O వస్తది.. అప్పుడు ఒక్కొక్కరికి?: జగన్ సంచలన వ్యాఖ్యలు..

మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని.. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   ‘ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారు. వంశీ, నందిగం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తాం. రిటైరైనా, దేశం విడిచి వెళ్లినా రప్పిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల…