AP

AP

ఐదేళ్లలో ఎంత నష్టం జరిగిందో అంతకు వడ్డీతో కలిపి తీసుకువస్తాం: మంత్రి నారా లోకేశ్..

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు… రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారు…. చంద్రబాబు గారి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి… మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ అతిథిగా విచ్చేశారు. ఈ…

AP

కర్మభూమిలో ఎదగండి… జన్మభూమి కోసం నిలవండి: సింగపూర్ లో తెలుగువారికి చంద్రబాబు పిలుపు..

విదేశాల్లో స్థిరపడి… సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయ్ ల్యాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. సీఎం సభా ప్రాంగణానికి రాగానే సభకు హాజరైన…

AP

సింగపూర్ లో చంద్రబాబు.. భారత హైకమిషనర్ తో భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సింగపూర్ లోని షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్‌తో పాటు ఏపీ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు బృందం శిల్పక్ అంబులేకు…

APNationalTELANGANA

ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..

ఏపీ, తెలంగాణ‌ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తుది ఉత్తర్వులు జారీ చేసింది.   ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన సమయంలో.. ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని…

AP

విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..

విశాఖపట్నం, విజయవాడ మెట్రో మొదటి దశ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెండు ముఖ్య నగరాల మెట్రో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. మెట్రో ప్రాజెక్టు, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై కన్సల్టెన్సీలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది.   మంత్రి సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు…

AP

కుప్పంలో 250 కుటుంబాలకు అండగా చంద్రబాబు..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పీ4’ (ప్రజా-ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.   శుక్రవారం సచివాలయంలో ‘పీ4’ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ‘పీ4’ లోగోను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు ముఖ్యమంత్రికి ‘#IAmMaargadarshi’ (నేను…

AP

కార్గిల్ విజయ్ దివస్ ..అమరవీరులకు నివాళీలు..!

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఆ వీడియోను వాయుసేన తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది.   1999 మే – జులై మధ్య భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన…

AP

మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన..

దేశంలో అత్యుత్తమ మోడల్ తో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు నిర్మాణంచేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుపై అధికారులతో మంత్రి సమీక్షించారు.   ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల…

AP

ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులకు కీలక ముందడుగు..

ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ దిశగా నేడు కీలక ముందుడుగు పడింది. ఈ రెండు ముఖ్య నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.   మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.10,118 కోట్లతో…

AP

ఉప్పాడ తీరంలో రాకాసి అలలు..! జలమయంగా మాయపట్నం..

ఉప్పాడ తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగడంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామం జలమయంగా మారింది. సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకు రావడంతో 20 ఇళ్లు కూలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. సముద్రపు నీరు దాదాపు 70 ఇళ్లలోకి చేరిందని, బయట అడుగుపెట్టే వీలులేకుండా పోయిందని వాపోయారు. తీర ప్రాంతంలో రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం కావడం వల్లే గ్రామంలోకి సముద్రపు నీరు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మాయపట్నం గ్రామానికి చేరుకున్న అధికారులు…