AP

AP

టీడీపీలోకి అవంతి రీఎంట్రీ..?

ఒక్కటేంటే ఒక్క ఘటన రాజకీయ నాయకుల తలరాతలను మార్చేస్తుంది. రాజకీయాల్లో ఒక్కోసారి తప్పు చేసినా చేయకపోయినా రాజకీయ పార్టీల్లో నెగిటివ్ టాక్ వస్తే దాని ప్రభావం పొలిటికల్ కెరీయర్‌పై రిఫ్టెక్ల్ అవుతుంది. అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంలో పడిన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కొత్త ఆశలు చిగురింప చేస్తోందంట. టీడీపీలో తిరిగి జాయిన్ అవ్వడానికి దారులు మూసుకుపోయాయి అనుకుంటున్న తరుణంలో ఆయనకు అధిష్టానం డోర్లు తెరవడానికి సిద్దమైందంట. నాయకులకు అగ్ని…

APTELANGANA

కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో కొత్త కోణం..!

కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.  తిరుపతిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గుణశేఖర్ ఒకరు. మరొకరు హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు మూడురోజులుగా గాలింపు చేపట్టాయి. అరెస్టయిన వీరిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వీరిని తీసుకొచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు. అయినా మూడో కంటికి దొరక్కకుండా ఈ వ్యాపారం సీక్రెట్‌గా సాగుతోంది. మాదక ద్రవ్యాలను నిరోధించాల్సిన పోలీసులు, వాటితో…

AP

అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు.   అంబటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ, వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో…

AP

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు.. షర్మిల సంచలన వాఖ్యలు..

వెన్నుపోటు అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్…. ఆ పదానికి పేటెంట్ హక్కులు కూడా ఆయనకే దక్కుతాయి” అంటూ ఏపీ కాంగ్రెస్ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో, ఇవాళ వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించడంపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.వైసీపీ నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ఎలాంటి అర్థం లేదని, రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఎవరిదో…

AP

అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం… అధికారులకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు..

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించలేని భారీ పెట్టుబడులను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కేవలం 11 నెలల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రానికి తీసుకువచ్చిందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, ఉపాధి కల్పన మంత్రుల కమిటీ ఛైర్మన్ నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంపై ఏర్పాటు చేసిన మంత్రులు, ఉన్నతాధికారుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు…

AP

జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమం: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, జూన్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.   ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు…

AP

జగన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్..!

విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని ఆయన…

AP

మంగళగిరిలో త్వరలోనే రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీ… మంత్రి నారా లోకేశ్ సమీక్ష..

మంగళగిరి నియోజకవకర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి విడతగా సుమారు 3 వేల మందికి శాశ్వత…

AP

బుగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి .. ఏపీ సర్కార్‌కు నోటీసులు..

బుగ్గమఠం భూముల వివాదంపై వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం కార్యనిర్వహణ అధికారి (అసిస్టెంట్ కమిషనర్) జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెల 22న ఉత్తర్వులు జారీ…

AP

ఏపీలో రేషన్ సరకుల పంపిణీలో మార్పులు..!

రేషన్ సరకుల వ్యవహారం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులకు బదులుగా ఇంటివద్దకే వాహనంలో వచ్చి సరకులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు ఏడాదిగా అదే పద్ధతి కొనసాగించారు. కానీ ఇప్పుడు రేషన్ వాహనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే మార్పులపై ఇప్పుడు చర్చ మొదలైంది. రేషన్ వాహనాలు నిలిపివేయడం సంచలన నిర్ణయమే. ఇప్పటి వరకు ఇంటి వద్దనే, లేదా వీధి…