బడ్జెట్లో అన్నీ అబద్ధాలే.. అప్పులెంతో ఎందుకు చెప్పలేదు?: ప్రభుత్వంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం!
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం అంతా అబద్ధాల మయమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సభలో వాస్తవాలను దాచి అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్లో ఎలాంటి కొత్తదనం లేదని, గతంలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాన్నే మళ్లీ చదివినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పుల గురించి పదేపదే మాట్లాడే కూటమి ప్రభుత్వం, ఈ బడ్జెట్లో రాష్ట్రంపై ఉన్న అసలు అప్పు ఎంత ఉందో…

