బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని వైసీపీ నిరసనలు .
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పింది. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే…

