AP

AP

శ్రామికులందరికీ రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం: పవన్ కల్యాణ్..

దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) పురస్కరించుకుని ఈరోజు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.   ఇకపై కార్మికులను ‘కూలీలు’ అని కాకుండా ‘ఉపాధి శ్రామికులు’ అని గౌరవంగా సంబోధించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే…

AP

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ భేటీ.. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని సూచన..!

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన వారికి సూచించారు. “ఎవరి ఆదేశాలకోసమో మీరు ఎదురు చూడొద్దు, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ ఛార్జితో కలిసి మొదట కదలాల్సింది జిల్లా అధ్యక్షులే.. రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా లోకల్ గా కార్యక్రమాలు చేయాలి, వాటితో హైలైట్ కావాలి” అని వారికి ఉద్భోదించారు. స్తబ్దుగా ఉన్న జిల్లా పార్టీ శ్రేణుల్లో కదలిక తెచ్చేందుకు జగన్…

AP

సింహాచలంలో చందనోత్సవం వేళ తీవ్ర విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి..!

విశాఖ సిటీలోని సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోక ముందే ఎనిమిది భక్తులు ఈ లోకాన్ని వదిలిపెట్టారు. భక్తులు క్యూ లైన్‌లో ఉండగా సమీపంలోకి గోడ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.   మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. బస్టాండ్ నుంచి దేవాలయానికి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్…

AP

గ్రూప్ 1లో అక్రమాలు .. పీఎస్ఆర్‌పై మరో కేసు నమోదు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఇదివరకే ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.   అయితే ఆ సమయంలో గ్రూప్ 1 (2018) ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు…

AP

విశాఖకు త్వరలో గూగుల్… సీఎం చంద్రబాబు ప్రకటన..!

అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్‌పో’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నూతన భవనాలు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడారు.   రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు.   విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ,…

AP

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి..!

రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 10 జిల్లాలకు సంబంధించి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్ల నియామకాలను ఖరారు చేశారు.   వివిధ జిల్లాల డీసీసీబీ చైర్మన్లుగా నియమితులైన వారు:   ఈ నియామకాలతో కీలకమైన సహకార రంగ సంస్థలకు కొత్త అధిపతులు వచ్చినట్లయింది. ప్రభుత్వం త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం…

AP

ఏపీ లిక్కర్‌ స్కాం.. సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌..

ఏపీ లిక్కర్ పాలసీలో ట్విస్టులు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. ఎవరెవరికి సంబంధం ఉంది.. మద్యం పాలసీ ఎలా తయారు చేశారు.. ఆర్గనైజ్డ్ గా ముడుపులు ఎలా మళ్లించారు.. కుట్రలకు కేంద్రస్థానం ఏంటి.. సప్లై, సేల్స్ కు ఆఫ్ లైన్ ఎందుకు పెట్టారు.. ఇదంతా దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు. కానీ దగ్గరి నుంచి చూస్తే ఒక్కో లెక్క బయటికొస్తుంది. ఇప్పుడు సిట్ కూడా అదే చేస్తోంది.   తాజాగా ఏపీ లిక్కర్‌ స్కాంలో…

AP

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ..

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.   కాగా.. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల…

AP

‘సస్పెన్షన్‌‌ తాత్కాలిక విరామం’.. మళ్లీ వస్తానన్న దువ్వాడ..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీ వైపు వెళ్తారో తెలీదు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు.. ఆపై అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఒకరు. ఆయన మాటలకు అర్థాలు ఎప్పుడూ వేరుగానే ఉంటాయి. దాని లోతుల్లోకి వెళ్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు అదే చేస్తున్నారు.   దువ్వాడ రియాక్ట్ వెనుక   దువ్వాడ శ్రీనివాసరావు.. సరిగ్గా ఐదేన్నరేళ్ల…

AP

లిక్కర్‌ స్కామ్‌‌లో.. చాణక్య అరెస్టు..!

మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రూపొందించిన నెట్వర్క్ నిర్వహణలో.. రాజ్ కెసిరెడ్డి ప్రతినిధిగా కీలకపాత్ర పోషించిన.. బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో.. ఎనిమిదో నిందితుడైన చాణక్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందటే చాణక్య దుబాయ్ కి పారిపోయారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతమవటం, సిట్ అన్ని వైపుల నుంచీ ఉచ్చు బిగించటంతో తప్పించుకునే మార్గం…