AP

AP

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నారా లోకేశ్ కీలక వినతి..

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నిన్న రాత్రి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి లోకేశ్ పలు కీలక వినతులు చేశారు.   కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని లోకేశ్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో రాబోతున్న…

APTELANGANA

ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సూచన..

ఉభయ తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అంశాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.   విభజన జరిగి పదేళ్లు దాటినా పలు అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ…

AP

పులివెందులకు ఉప ఎన్నిక..? ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అది ఎలాగో ఆయన వివరించారు.   ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే… ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ తెలిపారు. ఈసారి గనుక జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప…

AP

వైసీపీకి కోలుకోలేని దెబ్బ..? పార్టీలో స్తబ్ధత..?

గత ఎన్నికల్లో ఘోర ఓటమి. కుదురుకునే లోపు ఒక్కొక్కరుగా నేతల జంప్‌. నా అనుకున్న వారు దూరం కావటంతో వైసీపీ అధినేత జగన్‌.. ఆలోచనలో పడ్డారట. కీలకనేతల రాజీనామాలతో.. పార్టీలో స్తబ్ధత నెలకొందట. వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని క్యాడర్‌కు భరోసా ఇస్తుంటే.. పార్టీ నడిపించటంలో తనకు తోడుగా ఉన్న ప్రముఖులు వీడటంతో వైసీపీ అధినేత ఇరకాటంలో పడ్డారట. విదేశీ పర్యటన ముగించుకుని.. స్వదేశానికి తిరిగొచ్చిన ఫ్యాన్ పార్టీ అధినేత.. రూట్‌ మ్యాప్ ఏంటనే చర్చ జోరుగా…

AP

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి…

AP

వివేకా కేసులో సునీత సంచలన నిర్ణయం..!

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత మరోసారి హై కోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. తాజా పిటీషన్ లో కీలక అంశాలు ప్రస్తావించారు. కేసు విచారణలో జాప్యం పైన హైకోర్టుకు వివరించారు. కేసు విచారణ వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలను తన పిటీషన్ లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టులో కేసు విచారణ ఆరు నెలల సమయంలో పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సునీత అభ్యర్ధించారు.   తెలంగాణ హైకోర్టులో వివేకా…

AP

ఆ ఛానెళ్లపై కేసు నమోదు.. లైసెన్స్ లను రద్దు చేయాలని టీటీడీ ఫిర్యాదు..

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తొలిసారి తన పవర్ చూపించారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు చైర్మన్ హెచ్చరించారు. కానీ కొందరు అదే రీతిలో ప్రవర్తిస్తున్నట్లు గుర్తించిన టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. మున్ముందు ఇలాంటి దుష్ప్రచారం ఎవరూ సాగించకుండ ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇంతకు అసలేం జరిగిందంటే..   ఇటీవల చాగంటి కోటేశ్వరరావు తిరుమలకు వచ్చిన సమయంలో, చాగంటికి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో…

AP

ఏపీలో ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’..

ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. పాఠశాలల్లో కో-కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం బ్యాగుల బరువు నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాలని, ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని సూచించారు.   అలాగే, ఉపాధ్యాయులకు ఇప్పుడున్న పలు యాప్‌ల స్థానంలో ఒకే…

AP

రైలు పట్టాలపై పడుకోబెడతా.. వారికి ఎమ్మెల్యే గుమ్మనూరు వార్నింగ్..

తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని… నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని… వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు.…

AP

ఆంధ్రప్రదేశ్​ లో జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్..

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. వీటిని అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబర్‌ క్రైమ్‌ ను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా నేరస్థుల బారిన పడకుండా…