AP

AP

ఏపీలో మరో పెన్షన్ సర్వే-ఈసారి టార్గెట్ వారే..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయం పెన్షన్ల పెంపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు.. అదే సమయంలో అనర్హులకు వీటి ప్రయోజనం అందకుండా కట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో అధికారులు పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేపడుతున్నారు. ఇప్పటికే అనర్హుల గుర్తింపుకు పలు సర్వేలు చేసిన అధికారులు ఇప్పుడు మరో సర్వేకు సిద్దమయ్యారు.   ఇప్పటివరకూ ఏపీలో…

AP

పవన్ బావ.. లోకేష్ అన్న.. శ్రీ రెడ్డి సంచలన ట్వీట్..

మొన్నటి వరకు నన్ను వదిలేయండి మహాప్రభో అంటూ విన్నపాలు. లోకేషన్నా సారీ.. పవన్ అన్నా సారీ.. నేను ఇక రాజకీయాల జోలికి రాను. నాకు అవసరం లేదు. నన్ను మాత్రం వదిలేయండి అంటూ మాటలు.. కన్నీళ్లు. నేడు మాత్రం నేను మళ్లీ వచ్చేశా అనే రేంజ్ లో ఓ ట్వీట్. ఆ ట్వీట్ తో కూటమిలో లుకలుకలు పెట్టేందుకే ప్రయత్నిస్తోందని తెగ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.. శ్రీరెడ్డి. సైలెంట్ గా ఉన్న…

AP

ప్రథమ్ థింక్ గ్యాస్ స్టేషన్లు ప్రారంభించిన ఏపీ సీఎం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కోస్టల్ ఏరియా ఉండడం ఓ వరమన్నారు సీఎం చంద్రబాబు నాయడు. ఆ కారణంగానే.. రాష్ట్రంలో గ్యాస్ ఉత్పత్తి భారీ ఎత్తున ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి పెద్దఎత్తున ఉన్నా, వినియోగంలో ఇంకా వెనుకబడి ఉన్నామని అన్నారు. తిరుచానూరు నుంచి రాష్ట్రంలో ఇంటింటికి సహజవాయువు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ.. అనేక అంశాల్లో ప్రభుత్వ ఆలోచనల్ని వెల్లడించారు.   తొలుత తిరుచానూరుకు…

AP

వైఎస్‌ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదు..! కిరణ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉండి ఉంటే.. అసలు ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగేది కాదని చాలా మంది చెబుతుంటారు.. కానీ, ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.⁠ కానీ, రాజశేఖర్ రెడ్డి తోనే రాష్ట్ర విభజనకు…

AP

మాకెందుకీ పదవులు, బోర్డు Vs అధికారులు మధ్య రచ్చ..

టీటీడీలో రచ్చ కొనసాగుతోంది. తిరుపతి తొక్కిసలాట ఘటన పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చర్యలు.. డిప్యూటీ సీఎం ఆగ్రహంతో పాలక మండలి అత్యవసర భేటీ అయింది. అధికారుల తీరు పైన బోర్డు సభ్యులు విరుచుకుపడ్డారు. తొక్కిసలాటకు కారణం అధికారులే అని ఫైర్ అయ్యారు. ఛైర్మన్, సభ్యులు నేరుగా అధికారుల పైనే గురి పెట్టారు. ఈవో లక్ష్యంగా సభ్యులు విమర్శలు చేసారు. దర్శన టోకెన్ల కోటా గురించి చర్చకు వచ్చింది. దీంతో, తొక్కిసలాట రచ్చ టీటీడీలో…

AP

కొత్త రేషన్ కార్డుల జారీ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై..

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు పూర్తయింది. తొలుత సంక్రాంతికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల ని భావించారు. కానీ, రెవిన్యూ సదస్సుల కారణంగా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతికత వినియోగించి జారీ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దరఖాస్తుల స్వీకరణ.. జారీ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.   ప్రభుత్వం కసరత్తు…

AP

తిరుపతి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం… కాంట్రాక్టు ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు..

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. నేడు తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నిప్పులు చెరిగారు. ఘటన స్థలిని స్వయంగా పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిన చంద్రబాబు… మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు.   ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు… కీలక నిర్ణయాలు ప్రకటించారు. మృతుల…

AP

తిరుమల సాక్షిగా పవన్ సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ విధానం రద్దు..?

తిరుమలలో వీఐపీ సంస్కృతి కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. టీటీడీ పాలక మండలి వీఐపీ ఫోకస్ వదిలి పెట్టి, సామాన్యులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని స్విమ్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రమాదం జరగడానికి కారణాలపై అధికారులతో చర్చించారు.   తిరుమలలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని, వీఐపీ లపై…

AP

ఈ నెలాఖరు నుంచి ప్రజల్లోనే జగన్..?

వైసీపీ అధినేత జగన్ ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.   మన పాలనలో అన్నీ ఇంటివద్దనే డోర్ డెలివరీ చేశాం… కానీ ఇప్పుడు ప్రజలు టీడీపీ నాయకుల వద్దకు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మనమంతా…

AP

భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసీ.. ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సమీక్షించారు. ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా…