AP

AP

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్.. 6న భువనేశ్వరి శంకుస్థాపన..

విజయవాడలో త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భుశనేశ్వరి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భవనం కోసం ఇటీవల 16వ జాతీయ రహదారిపై నున్న ఎల్ఈపీఎల్ మాల్ పక్కన, సాయిబాబా ఆలయ రోడ్డు జంక్షన్‌లో 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో జీప్లస్ 5 విధానంలో అత్యంత అధునాతనంగా భవనాన్ని నిర్మించనున్నారు.   ప్రస్తుతం హైదరాబాద్‌లోని…

AP

తిరుమల ఇక నో ఫ్లయింగ్ జోన్..? కేంద్రానికి లేఖ రాసిన టీటీడీ చైర్మన్..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఇప్పటికే పలు తీర్మానాలు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సమస్యకు సంబంధించి జోక్యం చేసుకోవాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.   తాజాగా తిరుమల కొండపై నుంచి వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఎప్పటి నుంచో ఇలాగే…

AP

పోసాని గుండెనొప్పి ఫేక్- తేల్చేసిన పోలీసులు-మళ్లీ జైలుకు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయి రాజంపేట జైల్లో ఉన్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్ధతకు గురికావడం అబద్దమని తేలిపోయింది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుండెనొప్పి వచ్చినట్లు జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని పోలీసులు తేల్చేసారు. ఈ మేరకు రాజంపేట పోలీసులు ఓ ప్రకటన చేశారు.   ఇవాళ రాజంపేట జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి గుండె…

AP

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు..

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు. అంబుల వైష్ణవి గతేడాది జూన్‌లో రాజధానికి రూ.25 లక్షలు, 2019కి ముందు పలుసార్లు కలిపి రూ.25 లక్షలను విరాళంగా అందించారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం ను వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు.

AP

ఏపీ బడ్జెట్.. ఆ శాఖకు భారీ కేటాయింపులు..

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మొత్తం రూ. 3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత పాలకులు ప్రతి శాఖలో ఆర్థిక అరాచకం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది.   అప్పు తీసుకునే శక్తి లేని ఏకైరా రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు ఆర్థిక…

AP

న్యాయమూర్తి ముందు పోసాని ఆవేదన..

న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి… పోసాని కృష్ణమురళికి 14రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. రాజంపేట సబ్‌జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్నరాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఏడు…

AP

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీసు సమీపంలోని ఎంపియుపి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీసు సమీపంలోని ఎంపియుపి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు #AndhraPradesh

AP

పెదపూడి మండలం గొల్లల మామిడాడ బూత్ నెంబర్ 140 లో, పెదపూడిలో 138,139 పోలింగ్ బూత్ లలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..

పెదపూడి మండలం గొల్లల మామిడాడ బూత్ నెంబర్ 140 లో, పెదపూడిలో 138,139 పోలింగ్ బూత్ లలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.   ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం NDA నాయకులు, గొల్లల మామిడాడ, పెదపూడి గ్రామాల NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

AP

జనసేన పార్టీ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా బన్నీ వాసు..!

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మార్చి 14న జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు పార్టీ ముహూర్తం కూడా ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో దీనిని అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది.   ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనకు అప్పగించినట్లు ప్రచారం…

AP

వైసీపీ నేత వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదు..

ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఇప్పటికే మూడు కేసులు ఆయనపై నమోదయ్యాయి. తాజాగా మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ట ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు.   మురళీకృష్ణ, పోలీసుల కథనం ప్రకారం.. మర్లపాలెం శివారులో 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15…