జగన్ కామెంట్స్ కు సునీత కౌంటర్- మళ్లీ సానుభూతి డ్రామా-ఓటేయొద్దని పిలుపు..!
ఏపీలో ఎన్నికల వేళ మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం తెరపైకి వస్తోంది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా వివేకా హత్యను కొలిక్కి తీసుకురాలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం వైఎస్ జగన్ నిన్న ప్రొద్దుటూరులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా వివేకా హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ వివేకా హంతకులు బయటే తిరుగుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ కామెంట్స్ పై ఇవాళ…

