వైద్యరంగం తలదించుకునే ఘోరం: కడుపులో కత్తెరకు మహిళ బలి.. 18 నెలల నరకం తర్వాత విషాదాంతం!
వైద్యం చేసి ప్రాణాలు కాపాడాల్సిన చేతులే అజాగ్రత్తతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బీహార్లోని మోతిహారీ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 18 నెలల క్రితం ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఉషాదేవి (25) అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సకు వాడిన 12 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను పొరపాటున ఆమె కడుపులోనే మరిచిపోయి కుట్లు వేశారు. ఆ అజాగ్రత్తే ఆ తల్లి పాలిట కాలపాశంగా మారింది.…

