National

National

నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఫడ్నవీస్‌ను హెచ్చరించిన ఏక్‌నాథ్ షిండే…

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే మధ్య అగాధం పెరుగుతోందన్న ఊహాగానాల నేపథ్యంలో తాజాగా షిండే చేసిన వ్యాఖ్యలు దీనిని బలపరిచాయి. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆయన చేసిన హెచ్చరికలు కూటమిలో లుకలుకలను బయటపెట్టాయి. ఫడ్నవీస్ సమావేశాలకు దూరంగా ఉంటున్న షిండే.. తనను ఒకసారి తేలిగ్గా తీసుకున్నందుకు 2022లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు.   షిండే సీఎంగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ.900 కోట్ల…

National

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.   ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ…

National

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్..

మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. అయితే, ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.   ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని,…

National

భారత్ లోకి టెస్లా..! ప్రధానితో మస్క్ భేటీ తర్వాత మారిపోయిన సీన్..

అంతర్జాతీయంగా టెస్లా కార్లతో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. అతిపెద్ద ఆటోమొబైళ్ల వినియోగదారులున్న భారత్ లో అడుగుపెట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. కానీ.. సంస్థ ప్రణాళికలు, భారత్ లోని చట్టాలకు మధ్య పొంతన కుదరక ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న భారత్ వంటి మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది. కానీ.. ఇటీవల మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. ఎలాన్ మస్క్ టెస్లా కార్లు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది.…

National

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్.. ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి..

భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గత రాత్రి వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. మరో ఈసీగా సుఖ్‌బీర్ సింగ్ ఉన్నారు.   అంతకుముందు ప్రధానమంత్రి…

NationalTechnology

యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే..

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు.   ఫోన్‌పే వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ…

National

హమాస్ సంచలన ప్రకటన.. గాజాను వదులుకునేందుకు రెడీ..!

ఇజ్రాయెల్‌లో మారణహోమాన్ని సృష్టించి.. తద్వారా యుద్ధానికి కారణభూతమైన హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్ పై అధికారాన్ని వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈజిప్ట్ ఒత్తిడితోనే హమాస్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. గాజాలో ప్రస్తుతం పోలీస్, ఆరోగ్యం, పౌరసేవలు అన్నీ హమాస్ నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించేందుకు అంగీకరించింది. కాగా, హమాస్ నిర్ణయం వెనక డొనాల్డ్ ట్రంప్ విధానం కూడా ఒక కారణమని తెలుస్తోంది.   పాలస్తీనా…

National

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‪గా జ్ఞానేష్ కుమార్..!

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జ్ఞానేష్ కుమార్ ను తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఫిబ్రవరి 17న ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక కమిటీ…

National

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన..

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలసిిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రపతి పాలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో 2023 నుంచి మైతేయి, కుకీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి.   అయితే, సీఎం ఓ వర్గానికే మొగ్గు చూపుతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శించారు.…

National

ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు.. ఉచితాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి..

భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తమ స్వార్థం కోసం పార్టీలు ఓటర్లపై ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో నోటి ఏది వస్తే అది ఉచిత వాగ్ధానాలు చేస్తున్నారు. ప్రజల పని చేయడానికి ఇష్టం లేకుండా పార్టీలు చేస్తున్నాయి. ఏ పని చేయకుండానే ఆహారం, అకౌంట్లలో డబ్బులు వేస్తామని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మహిళలకు అకౌంట్లలో డబ్బుల వేస్తాం, ఉచిత బస్సు సౌకర్యం అందజేస్తాం.. ఇలా నోటికి వచ్చినట్లు…