ప్రసంగిస్తుండగా వెళ్ళిపోయిన మహిళలు.. ‘కూర్చోండి’ అంటూ నితీష్ కుమార్ తీవ్ర ఆగ్రహం!
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు తన సొంత రాష్ట్రంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. ‘సమృద్ధి యాత్ర’లో భాగంగా సివాన్ జిల్లాలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా, సభికుల్లోని మహిళలు మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం తీసుకువచ్చిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తున్న సమయంలోనే ఇలా జరగడం విశేషం. మహిళలు తన మాటలను పట్టించుకోకుండా నిష్క్రమించడం చూసి నితీష్ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. సభ నుంచి…

