అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు..
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. జోర్హాట్ ఎయిర్ బేస్ నుండి బయలు దేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. చొకిహోలా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందులోవున్న ఇద్దరు పైలట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గురువారం సాయంత్రం అసొంలోని జోర్హాట్లోని వైమానిక బేస్ నుండి బయలు దేరింది సుఖోయ్-30…

