National

National

బ్రిటన్ తో భారత్ వాణిజ్య ఒప్పందం..!

భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కేవలం వాణిజ్య బంధాలను పటిష్టం చేయడమే కాకుండా, భారతీయ వినియోగదారులకు అనేక ఉత్పత్తులను మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.   ఏయే ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి? ఈ ఒప్పందం ప్రకారం, బ్రిటిష్ ఉత్పత్తులైన కార్లు, చాక్లెట్లు, స్కాచ్ విస్కీ, సాల్మన్ చేపలు, శీతల పానీయాలు, సౌందర్య…

National

వినియోగదారులకు నేరుగా విక్రయం.. మింత్రాపై ఈడీ కేసు నమోదు..

ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ-కామర్స్ వేదిక ‘మింత్రా’పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించి రూ. 1,654 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి ఫారిన్ ఎక్స్చేంజీ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. మింత్రాతో పాటు, అనుబంధ సంస్థలు, డైరెక్టర్లపై అభియోగాలు మోపింది.   హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ ముసుగులో మింత్రా, దాని అనుబంధ సంస్థ మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడ్‌ను నిర్వహిస్తున్నాయని, ఇది ఎఫ్‌డీఐ నిబంధనలకు…

National

భారత్ కీలక నిర్ణయం..! చైనాకు పర్యాటక వీసాలు జారీ..

గాల్వన్ వద్ద 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాలను భారత్ నిలిపివేయడం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా చైనా వైఖరిలో మార్పు వచ్చింది. భారత్-చైనా మధ్య పలు చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా పర్యాటకులకు తిరిగి వీసాలు మంజూరు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ నిర్ణయం జూలై 24 నుంచి అమలులోకి వస్తుందని చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సరిహద్దు వివాదాలు, వాణిజ్య…

National

పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌..

భారత్ తన గగనతలాన్ని ఉపయోగించి పాకిస్థాన్ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 23 వరకు పాక్‌ విమానాలు భార‌త‌ గగనతలంలోకి ప్రవేశించకుండా బ్యాన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.   “పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా పరిమితం చేస్తున్న ఎయిర్‌మెన్ నోటీసు (NOTAM)ను అధికారికంగా ఆగస్టు 23 వరకు పొడిగించడం జ‌రిగింది. ప్రస్తుత భద్రతా ప్రోటోకాల్‌కు అనుగుణంగా…

National

యూపీఐ లావాదేవీల్లో భార‌త్ టాప్: ఐఎంఎఫ్‌..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల్లో ప్ర‌పంచంలోనే భార‌త్ టాప్‌గా నిలిచింద‌ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తెలిపింది. ‘గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ చెల్లింపులు: ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ’ పేరిట‌ ఐఎంఎఫ్‌ ఇటీవల విడుదల చేసిన నోట్ ప్రకారం యూపీఐ వేగవంతమైన వృద్ధి కారణంగా భారత్‌ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేడు మ‌న దేశంలో ప్ర‌తి నెలా 1800 కోట్ల‌కు పైగా యూపీఐ లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని ఐఎంఎఫ్ పేర్కొంది.  …

National

శ్వాన్ సింగ్ చదువుల ఖర్చు భరించేందుకు నిర్ణయించిన భారత సైన్యం..! ఎవరూ ఈ శ్వాన్ సింగ్…?

పదేళ్ల వయసున్న శ్వాన్ సింగ్ అనే బాలుడి చదువుకు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సైన్యంలోని గోల్డెన్ యారో డివిజన్ ముందుకు వచ్చింది. భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ బాలుడు సైన్యానికి అందించిన సేవలే.   పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ తారావాలీ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. శత్రుదేశంతో భారత సైన్యం తలపడుతున్న సమయంలో ఆ…

National

చిన్నస్వామి తొక్కిసలాట ఘటన.. కోహ్లీపై నిందలు వేస్తారా అంటూ బీజేపీ ఫైర్..!

ఐపీఎల్ విజయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని భావించిందని, ప్రమాదం జరిగిన తర్వాత విరాట్ కోహ్లీ, ఆర్సీబీని నిందిస్తోందని కర్ణాటక బీజేపీ విమర్శించింది. ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల నివేదికను విడుదల చేసింది.   ఈ నివేదికలో కోహ్లీ, ఆర్సీబీని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తోందని బీజేపీ నేత అరవింద్ విమర్శించారు.…

APNationalTELANGANA

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ జలవివాదాలపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై సీఆర్ పాటిల్ తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. గోదావరి…

APNationalTELANGANA

బనకచర్లపై నో డిస్కషన్.. : సీఎం రేవంత్..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించగా.. తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో…

National

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..!

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి ఆరేళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు.   వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను…