National

National

అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు..

అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. జోర్హాట్ ఎయిర్‌ బేస్ నుండి బయలు దేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చొకిహోలా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందులోవున్న ఇద్దరు పైలట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.   గురువారం సాయంత్రం అసొంలోని జోర్హాట్‌లోని వైమానిక బేస్ నుండి బయలు దేరింది సుఖోయ్-30…

NationalTechnology

ఆ వీడియోలు పోస్ట్ చేస్తే 90 రోజుల సస్పెన్షన్.. ‘ఎక్స్’ కొత్త నిబంధన..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) తమ కంటెంట్ క్రియేటర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అలాంటి క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.   ఈ కొత్త నిబంధనలను ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. యుద్ధ సమయాల్లో తప్పుడు…

National

ఇరాన్‌పై యుద్ధంలో ఏఐ ఆయుధాలు రంగంలోకి దించిన అమెరికా..

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణలో అమెరికా సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన ఈ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అటానమస్ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం నాడు ధృవీకరించారు. పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ ఏఐ సామర్థ్యాలున్న డ్రోన్లు, ఇతర వ్యవస్థలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వాటి పూర్తి వివరాలను వెల్లడించలేనని స్పష్టం చేశారు.  …

National

ఇరాన్‌పై యుద్ధం నిలిపివేయాలన్న రష్యా, చైనా… వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న అమెరికా..

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యా, చైనా చేసిన విజ్ఞప్తులను అమెరికా తోసిపుచ్చింది. ఈ ఘర్షణ పూర్తిగా టెహ్రాన్ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని, ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారం నాడు పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాట్లాడారు. ఈ విషయంలో బీజింగ్ లేదా మాస్కోతో తాము చర్చించడం లేదని, ప్రస్తుత ఘర్షణలో వారి ప్రమేయం ఏమాత్రం…

National

ఇరాన్‌పై దాడికి ముందు 74 సార్లు హెచ్చరించిన ట్రంప్..

ఇరాన్‌పై సైనిక చర్యల దిశగా ఆలోచన చేస్తున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేశారు. ఇరాన్‌ను అణ్వాయుధాలు కలిగి ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తాను దశాబ్దాలుగా చెబుతున్న మాటనూ గుర్తుచేశారు. ఈ విషయంలో ట్రంప్ మొదటి నుంచీ ఒకే వైఖరితో స్థిరంగా ఉన్నారని వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది. ఇందుకు నిదర్శనంగా గత 15 ఏళ్లలో ఆయన చేసిన 74 కీలక ప్రకటనల జాబితాను విడుదల చేసింది.  …

National

ఇరాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన ఖతార్..

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌ ల దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన దాడులు గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్‌కు చెందిన రెండు ఎస్ యూ-24 యుద్ధ విమానాలను ఖతార్ వైమానిక దళం కూల్చివేసింది. తమ దేశంపైకి దూసుకొస్తున్న ఇరాన్ యుద్ధ విమానాలను గుర్తించిన వెంటనే కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు 7 బాలిస్టిక్ క్షిపణులను నావికా,…

National

ముడి చమురు రాజకీయం.. రష్యాకు భారత్ దూరం..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ భారీ డిస్కౌంట్లకు రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై గతేడాది మార్చిలో భారీగా సుంకాలు విధించింది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడటంతో, న్యూఢిల్లీ ఇప్పుడు తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది.   గత జనవరిలో రోజుకు 12 లక్షల బారెళ్లుగా ఉన్న…

NationalSPORTS

భారత్-పాక్ మ్యాచ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న శ్రీలంక‌..

టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ అనూహ్యంగా తొలగించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చుతూ, ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.   భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ ప్రాథమిక దశలోని నాలుగు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. అయితే, భారత్‌లో భద్రతపై ఆందోళన…

APNationalTELANGANA

ఆధార్ సేవలపై కీలక అప్డేట్..! ఇకపై ఇంట్లోనే..!

ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుంచే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.   గతంలో ఉన్న mAadhaar యాప్ కంటే…

National

మున్సిపల్ ఎన్నికల ప్రచారం: అమిత్ షా ధాటి.. రేవంత్ రెడ్డి పర్యటనల షెడ్యూల్ ఖరారు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు వెల్లడించారు. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన వెంటనే, ఫిబ్రవరి 3వ తేదీ నుండి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటనలు ప్రారంభించనున్నారు. బీజేపీ వ్యూహం: భారీ బహిరంగ…