National

National

అభయారణ్యంలో 4 పులి పిల్లలు మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లోని బఫర్ జోన్‌లో శనివారం నాలుగు పులి పిల్లలు చనిపోయాయి. అటవీశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పులి పిల్లలపై గాయపడిన గుర్తులు కనిపించాయి. వాటిని పులి చంపిందని తేలింది. శనివారం ఉదయం బఫర్ జోన్‌లోని శివ్‌ని ఫారెస్ట్ రేంజ్‌లో మూడు నుంచి నాలుగు నెలల వయసున్న రెండు మగ, రెండు ఆడ పిల్లల మృతదేహాలు లభ్యమైనట్లు రిజర్వ్‌లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జితేంద్ర…

National

తమిళనాడులో ఆసుపత్రి హ్యాకర్ల దాడి

ఢిల్లీ ఎయిమ్స్‌లో సైబర్ దాడి నుంచి కోలుకునే ప్రక్రియ కొనసాగుతుండగానే తమిళనాడులోని ఓ ఆసుపత్రి హ్యాకర్ల దాడికి గురైంది. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌కు చెందిన 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు ప్రముఖ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లో విక్రయించారు. అలాగే డేటాబేస్ విక్రయించడానికి టెలిగ్రామ్ ఛానెల్‌ను ఉపయోగించారు. డేటా ఉల్లంఘనను సైబర్ అటాక్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ కనుగొంది. తమిళనాడులోని శ్రీ శరణ్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రికి చెందిన రోగుల డేటాను…

NationalTechnology

ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ న్యాయ పోరాటం.. సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు

ఇస్రో(Indian Space Research Organisation – ISRO) లో దేశీయంగా క్రయోజెనిక్ ఇంజిన్ ను రూపొందించడానికి కృషి చేసిన కేరళకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్.. ఇస్రోకు సంబంధించిన కీలక రహస్య పత్రాలను విదేశాలకు అమ్మేశాడనే ఆరోపణలపై ఆయనను 1994 నవంబర్ లో అరెస్ట్ చేశారు. నంబి నారాయణన్ తో పాటు మరో ఇద్దరు శాస్త్రవేత్తలను కూడా ఇవే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. 1994 డిసెంబర్ లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. Nambi Narayanan…

NationalTELANGANA

లిక్కర్‌ స్కామ్‌ కేసు.. బిగ్ బ్రేకింగ్‌ : కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సిబిఐ తాజాగా ఎమ్మెల్సీ కవిత కి కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ నోటిలో పేర్కొంది. ఇప్పటికే కవిత ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపి నాయకుల పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.…

National

మనీలాండరింగ్ కేసులో భాగంగా సౌమ్య చౌరాసియా అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్

తాజాగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో భాగంగా సౌమ్య చౌరాసియా అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసింది. సౌమ్య ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ వద్ద డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తోంది. ఈడీ ఆమెను అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెను పదిరోజుల పాటు రిమాండ్‌కు తరలించాలని కోరింది. కాగా 2020 ఫిబ్రవరిలో సీఎం భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ముఖ్యమంత్రి…

NationalWorld

‘ఒకే ప్రపంచం, కుటుంబం, ఒకే భవిత’

జీ 20(G20) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ బాధ్యతలను భారత్ సంవత్సరం పాటు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రాథమికంగా, మన ఆలోచనా ధోరణిలోనే మార్పు రావాలని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయీకరణ అనేది మనిషి కేంద్రంగా జరగాలని, ఆ దిశగా ఆలోచనల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. India assumes G20 presidency: అంతర్జాతీయ పత్రికల్లో ఆర్టికల్ జీ 20(G20) అధ్యక్షతకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికల్లో ప్రధాని మోదీ రాసిన వ్యాసం…

National

ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు అరెస్ట్

ఇటీవల ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ శ్రీనివాసరావు కేసులో భాగంగానే తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను తాజాగా సీబీఐ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి మంత్రి గంగుల అలాగే వద్దిరాజు రవిచంద్ర నేడు మధ్యాహ్నం 12 గంటలకు హాజరయ్యారు. నకిలీ సిబిఐ అధికారి నేను శ్రీనివాసరావు తో సంబంధాలు ఉన్నాయా అన్న…

National

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు అంతా రెడీ

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, మాజీ మంత్రి పరుషోత్తమ్‌ సోలంకి, ఆప్‌ సీఎం అభ్యర్థి ఈశుదాన్ గఢ్వి, ఆప్ గుజరాత్ చీఫ్‌ గోపాల్ ఇటాలియా, మోర్బీ నుంచి కాంతిలాల్‌ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఫస్ట్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోదీషా సొంత రాష్ట్రం గుజరాత్‌లో.. వరుసగా ఏడోసారి కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళూరుతోంది బీజేపీ. అభివృద్ధి అజెండాతో ప్రచారం…

National

గుజరాత్ లో ఆప్ కార్యకర్తలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను కారులోకి ఎక్కించారు. మీడియాపై కూడా దాడి…

NationalWorld

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు పై కేరళలో ఆందోళనలు

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు(Vizhinjam Port) పై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ట్రాన్స్ షిప్‍మెంట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు.. కేరళలోని విజిన్‍జమ్ పోలీస్ స్టేషన్‍ (Vizhinjam Police Station) ను ముట్టడించారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‍పై దాడి చేశారు. దీంతో…