పాక్ గూఢచర్యం కేసులో ప్రముఖ యూట్యూబర్తో జ్యోతి మల్హోత్రా అరెస్ట్..
హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ…

