National

National

భారత్ దీపావళి బాణసంచా: లాహోర్‌లో ప్రమాదకర స్థాయికి పడిపోయిన గాలి నాణ్యత

భారతదేశంలో ప్రజలు దీపావళి ఉత్సవాలను ఘనంగా జరుపుకోగా, ఆ ప్రభావం సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోని నగరాలను తాకింది. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా కాలుష్యం కారణంగా పాకిస్తాన్‌లోని లాహోర్ గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. భారతదేశం నుంచి దీపావళి బాణసంచా కారణంగా వచ్చిన కాలుష్యాలు, తక్కువ వేగంతో ఉన్న గాలులు కలిసి తమ నగరాల్లోని స్మాగ్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని పాకిస్తాన్ పంజాబ్ ప్రభుత్వం ఆందోళన చెందింది. అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పాకిస్తాన్…

National

జీఎస్టీ సంస్కరణలతో దేశంలో పెరిగిన కొనుగోళ్లు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల (GST Reforms) వల్ల దేశంలో కొనుగోళ్లు భారీగా పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా వచ్చిన పన్ను తగ్గింపు ప్రయోజనాలను సామాన్యులకు అందించామని ఆమె పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, జీఎస్టీ రేట్ల కోతలతో కలిగే ప్రయోజనం వినియోగదారులకు చేరినట్లు తెలిపారు. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను…

National

చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ ప్రశంసలు

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశం ఒక సూపర్ పవర్​గా ఎదిగిందని కొనియాడిన ఆయన, 21వ శతాబ్దం భారతదేశానిదేనని స్పష్టం చేశారు. NDTV వరల్డ్ సమ్మిట్​లో ప్రసంగించిన ఆయన, ప్రపంచంలోని కొత్త సూపర్ పవర్​లలో ఒకటిగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ‘ప్రజాస్వామ్య ప్రతిరూపం’గా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. నాలుగు లేదా ఐదు దశాబ్దాల తర్వాత అమెరికాను వెనక్కి నెట్టి భారత ప్రధాని ‘స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు’ హోదాను పొందే అవకాశం ఉందని…

National

ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది నక్సలైట్లు లొంగుబాటు: “నక్సలిజంపై పోరులో ఇది చారిత్రాత్మక రోజు” – కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన దిశగా మరో కీలక అడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా గురువారం 170 మంది నక్సలైట్లు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా “నక్సలిజంపై పోరాటంలో చారిత్రాత్మక రోజు”గా అభివర్ణించారు. అభూజ్మఢ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలు ఇక నక్సల్ ఉగ్రవాదం నుండి విముక్తి పొందాయని ఆయన ట్వీట్ చేశారు. లొంగిపోయిన వారిలో పలు కీలక దళ నాయకులు, ఆయుధ బాధ్యులు ఉన్నట్లు సమాచారం.…

National

2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెడతారు: ఇస్రో చీఫ్ నారాయణన్..

వికసిత భారత్‌కు సూచికగా 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెట్టనున్నారని ఇస్రో ఛీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రస్తుతం అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.   వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనానికి వీనస్ ఆర్బిటర్ మిషన్ ఏర్పాటు వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు.   2027లో చేపట్టబోయే…

National

శబరిమల బంగారం మాయం కేసులో సంచలన విషయాలు..

శబరిమల ఆలయంలో బంగారం చోరీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆలయ సన్నిధానంలో గర్భగుడి, ద్వార పాలక విగ్రహాలకు బంగారు తాపడం పనులలో ఏకంగా 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపరిచింది. దీంతో కేరళ హైకోర్టు స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది. బంగారు తాపడం పనుల బాధ్యత తీసుకున్న దాత ఉన్నికృష్ణన్ ను విచారించిన అధికారులు.. అతడికి స్థిరమైన ఆదాయమే లేదని తేల్చారు.   బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ గతేడాది ఐటీ…

National

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అలయన్స్ ఎయిర్ ‘ఫిక్స్‌డ్’ టికెట్ ధరలు..!

విమాన ప్రయాణికులకు ప్రభుత్వ రంగ సంస్థ అలయన్స్ ఎయిర్ ఒక శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు మారిపోయే టికెట్ ధరల ఒత్తిడి నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో ‘ఫేర్స్ సే ఫుర్సత్’ అనే వినూత్న పథకాన్ని ప్రారంభించింది. సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, అలయన్స్ ఎయిర్ ఛైర్మన్ అమిత్ కుమార్, సీఈఓ రాజర్షి…

National

జైళ్లలోని ఖైదీలకు ఓటు హక్కుపై సుప్రీంకోర్టులో విచారణ… కేంద్రానికి, ఈసీకి నోటీసులు..

దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు, శిక్ష ఖరారు కాని సుమారు 4.5 లక్షల మందికి ఓటు హక్కును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.   ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రముఖ…

National

భారత్‌కు వచ్చిన తాలిబన్ మంత్రి..!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటన, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కీలకమైనప్పటికీ, భారత అధికారులకు ఇది ఒక కొత్త రకమైన దౌత్యపరమైన సవాలును విసిరింది. సమావేశాల సందర్భంగా ఏ దేశపు జెండాను ప్రదర్శించాలనే అంశం ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది.   ఈ పర్యటనలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.…

National

స్వదేశీని మంత్రాన్ని స్వీకరించండి, దేశాన్ని బలోపేతం చేయండి: ప్రధాని మోదీ..

దేశ ప్రజలు ‘స్వదేశీ’ని స్వీకరించి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా, యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.   “ప్రతి ఒక్కరూ గర్వంగా ‘స్వదేశీ’ అని చెప్పాలి. ఇది ప్రతి పౌరుడికి, మార్కెట్‌కు ఒక మంత్రంలా మారాలి. ప్రజలు…