National

National

ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయబోతున్నట్టు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా కూడా పని చేసిన విషయం తెలిసిందే.   సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రెండు సార్లు కోయంబత్తూరు ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో జార్ఖండ్…

National

ఒడిశాలో బయటపడ్డ బంగారు ఖనిజ నిక్షేపాలు..

ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో ఇప్పటికే బంగారు నిక్షేపాల వెలికితీత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర…

National

ప్రపంచ వేదికపై భారత్‌కు సముచిత గౌరవం లభిస్తోంది: పుతిన్ ప్రశంస..

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ సాధించిన విజయాలను కొనియాడుతూ, ప్రపంచ వేదికపై దేశానికి ‘సముచిత గౌరవం’ లభిస్తోందని ప్రశంసించారు. ఫ్రాన్స్, అమెరికాతో దేశాల అధినేతలు కూడా భారత్‌కు అభినందనలు తెలియజేశారు.   “ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలతో పాటు ఇతర అనేక రంగాల్లో భారతదేశం సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. అంతర్జాతీయ వేదికపై మీ దేశానికి గొప్ప గౌరవం లభిస్తోంది.…

National

అమెరికా నుంచి భారీగా చమురు కొంటున్న భారత్..!

అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), తాజాగా ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల అమెరికా ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.   ఇంధన అవసరాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను…

NationalTechnology

బీఎస్ఎన్ఎల్ ముందడుగు … అందుబాటులోకి ఈ-సిమ్ సదుపాయం..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం రెండు కీలకమైన కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భౌతిక సిమ్ కార్డు అవసరం లేని ఈ-సిమ్ సౌకర్యంతో పాటు, రోజురోజుకూ పెరిగిపోతున్న స్పామ్ కాల్స్, మోసపూరిత సందేశాల నుంచి రక్షణ కల్పించేందుకు యాంటీ-స్పామ్ టూల్స్‌ను ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం, డిజిటల్ భద్రత కల్పించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.   ఫిజికల్ సిమ్‌కు స్వస్తి……

National

పుతిన్‌తో,ట్రంప్ చర్చలు ఫ‌ల‌ప్ర‌దం..

గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఫలప్రదంగా ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా గొప్ప పురోగతి సాధించామని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే, తుది ఒప్పందం ఖరారయ్యే వరకు ఏదీ ఖరారైనట్లు కాదని ట్రంప్ స్పష్టం చేశారు.  …

National

జీఎస్టీలో భారీ సంస్కరణలు..! సామాన్యుడికి భారీ ఊరట..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘డబుల్ దీపావళి’ హామీ కార్యరూపం దాల్చనుంది. దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న పలు జీఎస్టీ శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను కొనసాగించాలనే కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాడే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.   కొత్త విధానం…

National

జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం.

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల విచారణపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జడ్జెస్ (ఇంక్వైరీ) ఆక్ట్- 1968 కింద ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్…

National

అమెరికాను ఇరకాటంలో పెట్టిన పుతిన్..!

అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలితో ప్రత్యర్థులకు చుక్కలు చూపే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తాజాగా అమెరికాను ఇరుకునపెట్టేలా సంచలన ఎత్తుగడ వేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన ఆడిన మైండ్‌గేమ్‌తో వాషింగ్టన్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రత్యేక దూతగా క్రెమ్లిన్‌కు వచ్చిన స్టీవ్ విట్కాఫ్‌తో సమావేశమైన పుతిన్, ఓ అనూహ్య బహుమతిని ఆయన చేతికి అందించి కలకలం రేపారు.   అమెరికా…

National

అమెరికా శాటిలైట్‌తో ఇస్రో సరికొత్త చరిత్ర..

ఒకప్పుడు చిన్న రాకెట్ కోసం అగ్రరాజ్యం అమెరికా వైపు చూసిన భారత్, ఇప్పుడు అదే అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని తన సొంత గడ్డపై నుంచి నింగిలోకి పంపే స్థాయికి ఎదిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ఈ చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇటీవల నాసా-ఇస్రో సంయుక్త ‘నైసర్’ మిషన్‌ను విజయవంతం చేసిన ఉత్సాహంతో, మరో కీలక ఘట్టానికి నాంది పలుకుతోంది.   చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్…