National

National

ట్రంప్ 25 శాతం సుంకాలపై కేంద్రం స్పందన..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారత ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అయినప్పటికీ దీనిని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను రూపొందిస్తామని తెలిపింది.   ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకం వల్ల భారత్ నుంచి ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్…

National

నాతో డీల్ చేయండి..! అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..

‘ఆపరేషన్ సిందూర్’పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో డీల్ చేయాలని, ప్రధానమంత్రి వస్తే ఇంకా ఇబ్బందిపడతారంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.   చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించారు. అమిత్ షా ప్రసంగిస్తుండగా విపక్షాలు వాకౌట్ చేశాయి.   అమిత్ షా మాట్లాడేందుకు నిలబడగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో ప్రధానమంత్రి…

National

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్16… విజయవంతంగా కక్ష్యలోకి ‘నైసార్’..

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ, భారత వాహన నౌక జీఎస్ఎల్వీ-ఎఫ్16 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2,393 కిలోలు.   నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఇందులో ఉండే రెండు భారీ డిష్ ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్…

NationalSPORTS

భార‌త్‌, పాక్ సెమీస్ పోరుపై నీలినీడ‌లు.. త‌ప్పుకున్న స్పాన్స‌ర్‌..!

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2025లో భాగంగా నిన్న‌ వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక‌, సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే, ఈ సెమీస్ పోరుకు భారీ అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే పాక్‌తో భారత్ ఆడే విషయంపై సందిగ్దత నెలకొనగా.. తాజాగా ఈ టోర్నీ స్పాన్సర్స్ ఈజ్‌మైట్రిప్‌ ఈ మ్యాచ్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి త‌ప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం…

National

సింధూ జలాల ఒప్పందం… కీలక ప్రకటన చేసిన జై శంకర్ .

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం నాడు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పారు.   సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్న పాలకులు భారత రైతుల ప్రయోజనాల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన…

National

పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ రచ్చ.. సహనం కోల్పోయిన అమిత్ షా..

లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహనం కోల్పోయారు. విపక్షాలు దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా, విదేశీ వాదనలను నమ్ముతున్నాయని తీవ్రంగా విమర్శించారు.   పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ వాదనలను జైశంకర్ ఖండించారు. మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఆయన స్పష్టం…

National

ఉగ్రవాదుల మతం చూసి బాధపడొద్దు.. అఖిలేశ్ యాదవ్ కు అమిత్ షా కౌంటర్..

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించడంతో పాటు వారు దేశం దాటకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చేపట్టిన చర్చలో హోంమంత్రి అమిత్ షా ఈ రోజు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాదులను…

APNationalTELANGANA

ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..

ఏపీ, తెలంగాణ‌ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తుది ఉత్తర్వులు జారీ చేసింది.   ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన సమయంలో.. ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని…

National

దేవుడికి కానుకగా వెండి రివాల్వ‌ర్‌..!

రాజ‌స్థాన్‌లోని చిత్తౌడ్‌గ‌ఢ్‌లోని ప్రసిద్ధ సావ‌రియా సేఠ్ పుణ్య‌క్షేత్రంలోని శ్రీకృష్ణుడికి ఓ అజ్ఞాత భ‌క్తుడు వింత కానుక స‌మ‌ర్పించాడు. వెండి రివాల్వ‌ర్‌, తుపాకీ గుండ్ల‌ను దేవుడికి కానుక ఇచ్చాడు. ఈ రెండూ క‌లిపి దాదాపు అర‌కిలో బ‌రువు ఉంటాయ‌ని ఆల‌య అధికారులు వెల్ల‌డించారు. వీటితో పాటు రెండు వెండి వెల్లుల్లిపాయ‌ల‌ను కూడా ఆ భ‌క్తుడు దేవుడి హుండీలో వేసిన‌ట్లు తెలిపారు.   అయితే, దేవునికి ఓ ఆయుధాన్ని కానుక‌గా స‌మ‌ర్పించ‌డం ఇదే మొద‌టిసారి అని ఆల‌య ఛైర్మ‌న్ జాన‌కీదాస్…

National

విద్యార్థుల ఆత్మహత్యలపై కదిలిపోయిన సుప్రీంకోర్టు.. నివారణకు సంచలన మార్గదర్శకాలు..

దేశంలోని విద్యా సంస్థల్లో ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మద్దతు అందించేందుకు ఉద్దేశించిన 15 సమగ్ర మార్గదర్శకాలను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడమీలు, హాస్టళ్లు సహా అన్ని విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, సంస్థాగత మద్దతు లోపం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టు తీవ్ర…