కృత్రిమ మేధపై కేంద్రం కీలక వైఖరి.. నిర్మల సీతారామన్ స్పష్టత..
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) సాంకేతికత ఒక స్ప్రింటర్ వలె వేగంగా పరుగెడుతోందని, దానికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థ కూడా అంతే వేగంతో కదలాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే నైతిక విలువలను విస్మరించకుండా బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో నీతి ఆయోగ్ రూపొందించిన “వికసిత భారత్ కోసం ఏఐ: ఆర్థిక వృద్ధికి అవకాశాలు”…

