National

National

ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.…

National

ఎల్‌వోసీ వద్ద భారీ కుట్ర భగ్నం.. సైన్యానికి చిక్కిన పాకిస్థానీ గైడ్..!

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన భారీ చొరబాటు కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. రజౌరీ జిల్లాలోని గంభీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన చొరబాటుదారులకు మార్గనిర్దేశం చేస్తున్న ఒక పాకిస్థానీ గైడ్‌ను సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు గాయపడి వెనక్కి పారిపోయినట్టు అధికారులు తెలిపారు.   రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. ఆదివారం…

National

పూరి రథయాత్రలో మరోసారి తొక్కిసలాట.. పలువురు మృతి..

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరీలో మరోసారి విషాద ఘటన చోటు చేసుకుంది. గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట జరగడంతో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నియంత్రించలేని విధంగా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.   భక్తుల ఉత్సాహం..…

National

చైనాతో సరిహద్దు వివాదానికి ముగింపు..! ప్రత్యేక ఫార్ములాను చైనాకు ప్రతిపాదించిన రాజ్ నాథ్ సింగ్..!

భారత్-చైనా మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించి, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా నాలుగు సూత్రాలతో కూడిన ఒక ప్రత్యేక ఫార్ములాను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాకు ప్రతిపాదించారు. చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం సందర్భంగా ఆయన చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సరిహద్దుల్లో…

National

ఇక త్రివిధ దళాధిపతికి కీలక అధికారాలు..!

దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మధ్య మరింత సమన్వయం, సమైక్యత సాధించే దిశగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్‌కు మూడు సేవలకూ కలిపి ఉమ్మడి ఆదేశాలు, సూచనలు జారీ చేసే అధికారాన్ని అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.   ఇంతకుముందు,…

National

ఆర్మీకి కొత్త ఆయుధాలు..!

భారత సైన్యానికి కొత్త ఆయుధాలు రాబోతున్నాయి. కొత్త ఆయుధాల తయారీ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- DRDO,  భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మధ్య రూ.2,000 కోట్ల విలువైన డీల్ కుదిరింది. దీని ద్వారా సైన్యానికి కొత్త ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సైన్యం స్టెర్లింగ్ కార్బైన్ గన్‌లను ఉపయోగిస్తున్నాయి. వాటి స్థానంలో సరికొత్తగా 5.56×45 mm క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్-CQB కార్బైన్ మెషిన్ గన్‌లను రాబోతున్నాయి. ఈ ఒప్పందం రక్షణ రంగంలో స్వదేశీ కంపెనీలను…

National

పాకిస్థాన్‌కు మరోమారు వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్..

ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని, ఉగ్ర చర్యలకు శక్తియుక్తులతో వ్యూహాత్మకంగా బదులిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నార్తర్న్ కమాండ్ వద్ద సైనికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి నవభారతం దృఢంగా, నిశ్చయంగా ఉందని, ఉగ్రవాదానికి బాధితురాలిగా ఉండబోదని, శక్తితో, వ్యూహంతో ప్రతిస్పందిస్తుందని బలమైన సందేశం పంపామని అన్నారు.…

National

వాహ‌న‌దారుల‌కు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన..!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.   కేవలం రూ. 3వేల‌కే ఫాస్టాగ్ వార్షిక పాస్‌ ఈ నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు…

National

మత్స్యకారుల వలకు చిక్కిన ఓ అరుదైన, వింతైన చేప..! ఎక్కడంటే..?

తమిళనాడు సముద్ర తీరంలో ఓ అరుదైన, వింతైన చేప మత్స్యకారుల వలకు చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 30 అడుగుల పొడవున్న ఈ చేపను ‘ఓర్ ఫిష్’ అని పిలుస్తారు. సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు. అయితే, ఈ చేప దర్శనం అరిష్టాలకు, ముఖ్యంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో, ఈ నెల ఆరంభంలో పట్టుబడిన ఈ…

National

హనీమూన్ హత్యకేసులో మరో ట్విస్ట్..!

ఇండోర్‌ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా భార్య సోనమ్ రఘువంశీ బతికే ఉండేందుకు, ఆమె స్థానంలో మరో అపరిచిత మహిళను హత్య చేసి, ఆ మృతదేహాన్ని సోనమ్‌దిగా నమ్మించి, నిజం బయటపడే వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని హంతకులు పథకం పన్నినట్టు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ దారుణమైన కుట్రకు సోనమ్ ప్రియుడిగా చెబుతున్న రాజ్ కుష్వాహా…