National

National

కశ్మీర్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం..!

పహల్‌గామ్ లో దారుణమైన ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికుల్ని టార్గెట్‌గా మారణహోమం సృష్టించడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది.   అయితే, పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్థాన్ తీరుపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ దేశంలో దౌత్య సంబంధాలను పూర్తి తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని…

National

లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:30 గంటలకు న్యాయాధికారి భాస్కరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు కెసిరెడ్డిని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు.   అంతకుముందు, సిట్ అధికారులు రాజ్ కెసిరెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో…

National

పహల్గాం ఉగ్రదాడి… ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్ర‌ధాని మోదీ అత్య‌వ‌స‌ర భేటీ..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌ నేప‌థ్యంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్ర‌ధాని మోదీ త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భార‌త్‌కు తిరుగుప‌య‌న‌మ‌య్యారు. బుధ‌వారం ఉద‌యం ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగిన మోదీ… ఎయిర్‌పోర్టులోనే అత్య‌వ‌స‌ర భేటీ నిర్వ‌హించారు.   జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంక‌ర్‌, విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్త్రీతో స‌మావేశ‌మై…

National

కశ్మీర్‌లో టూరిస్టులపై కాల్పులు.. 27 మంది మృతి.. ఉగ్రవాదుల ఘాతుకం..

కశ్మీర్‌ లోయలో మరోసారి ఉగ్రవాదులు తుపాకులతో తెగబడ్డారు. పహెల్‌గామ్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపారు. 27 మంది పర్యాటకులు మరణించారు. మరో 20 మంది టూరిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దాడి సమాచారం అందగానే జమ్ము కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెంటనే కశ్మీర్ బయలుదేరారు.   టూరిజం స్పాట్‌లో ఫైరింగ్   హిల్ స్టేషన్ అయిన…

National

భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈసీఐ రాజీపడిందని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటింగ్ సరళిని రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపించారు.   “మహారాష్ట్రలో అర్హులైన వయోజనుల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు…

National

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం ‘ధ్వని’..

భారత అమ్ముల పొదిలోకి కొత్తగా మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. దాని పేరు ‘ధ్వని’. హైపర్‌సానిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) అయిన ఈ క్షిపణి ఇప్పటికే ఉన్న అగ్ని-5ను మించి ఉంటుందని సమాచారం. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 5,500 కిలోమీటర్లు కాగా, ‘ధ్వని’ రేంజ్ 6 నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.   ఈ క్షిపణిని మన లాంచ్ సైట్ల నుంచి ప్రయోగించి ఆసియా, యూరప్‌తోపాటు ఉత్తర అమెరికాలోని…

National

వక్ఫ్ చట్టం-2025ను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు… సుప్రీంకోర్టులో విచారణ..

వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 72 పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ బిల్లుపై సమాధానం చెప్పేందుకు కేంద్రం వారం రోజుల గడువు కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది.తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 5వ తేదీకి వాయిదా…

National

దేశంలోనే మొదటిసారిగా… రైల్లో ఏటీఎం సేవ‌లు..!

ముంబ‌యి నుంచి మ‌న్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర త‌న ఏటీఎంను అమ‌ర్చింది. భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో ఇలా రైలులో ఏటీఎం ఏర్పాటు చేయ‌డం ఇదే తొలిసారి. ఏసీ చైర్ కార్ కోచ్ చివ‌ర‌లో సాధార‌ణంగా ఉండే ప్యాంట్రీ (చిన్న గ‌ది)లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనికి ప్ర‌త్యేకమైన ష‌ట‌ర్‌ను అమ‌ర్చారు. ఇప్ప‌టికే దాని ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో భారతదేశంలో తొలిసారిగా ఏటీఎం సేవ‌లు క‌లిగిన…

National

వక్ఫ్ చట్టంపై పాక్ వ్యాఖ్యలు… భారత్ కౌంటర్..

వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్థాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఒక వర్గం వారి ఆస్తులకు దూరం చేయడానికే భారత్ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ కత్ అలీ పేర్కొన్నారు. ఇది మైనారిటీలను కించపరచడమేనని ఆయన అన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. దీనిపై తాజాగా భారత్ ధీటుగా స్పందించింది.భారత పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్థాన్ చేసిన ప్రేరేపిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగ…

National

వక్ఫ్ బిల్లును నిరసిస్తూ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్..

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హింస కారణంగా ముర్షిదాబాద్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.   బెంగాల్‌లో హింస, మరణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగాలని ఆయన విజ్ఞప్తి…