భారత్తో వాణిజ్య ఒప్పందంపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు..
భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పరస్పర సుంకాలను నివారించేందుకు ఉద్దేశించిన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే తొలి దేశాల్లో భారత్ ఒకటిగా నిలవవచ్చని వాన్స్ పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన సమర్థవంతంగా చర్చలు జరపగలరని కొనియాడారు.…

