National

NationalTechnology

బీఎస్ఎన్ఎల్ ముందడుగు … అందుబాటులోకి ఈ-సిమ్ సదుపాయం..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం రెండు కీలకమైన కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భౌతిక సిమ్ కార్డు అవసరం లేని ఈ-సిమ్ సౌకర్యంతో పాటు, రోజురోజుకూ పెరిగిపోతున్న స్పామ్ కాల్స్, మోసపూరిత సందేశాల నుంచి రక్షణ కల్పించేందుకు యాంటీ-స్పామ్ టూల్స్‌ను ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం, డిజిటల్ భద్రత కల్పించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.   ఫిజికల్ సిమ్‌కు స్వస్తి……

National

పుతిన్‌తో,ట్రంప్ చర్చలు ఫ‌ల‌ప్ర‌దం..

గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఫలప్రదంగా ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా గొప్ప పురోగతి సాధించామని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే, తుది ఒప్పందం ఖరారయ్యే వరకు ఏదీ ఖరారైనట్లు కాదని ట్రంప్ స్పష్టం చేశారు.  …

National

జీఎస్టీలో భారీ సంస్కరణలు..! సామాన్యుడికి భారీ ఊరట..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘డబుల్ దీపావళి’ హామీ కార్యరూపం దాల్చనుంది. దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న పలు జీఎస్టీ శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను కొనసాగించాలనే కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాడే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.   కొత్త విధానం…

National

జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం.

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల విచారణపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జడ్జెస్ (ఇంక్వైరీ) ఆక్ట్- 1968 కింద ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్…

National

అమెరికాను ఇరకాటంలో పెట్టిన పుతిన్..!

అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలితో ప్రత్యర్థులకు చుక్కలు చూపే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తాజాగా అమెరికాను ఇరుకునపెట్టేలా సంచలన ఎత్తుగడ వేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన ఆడిన మైండ్‌గేమ్‌తో వాషింగ్టన్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రత్యేక దూతగా క్రెమ్లిన్‌కు వచ్చిన స్టీవ్ విట్కాఫ్‌తో సమావేశమైన పుతిన్, ఓ అనూహ్య బహుమతిని ఆయన చేతికి అందించి కలకలం రేపారు.   అమెరికా…

National

అమెరికా శాటిలైట్‌తో ఇస్రో సరికొత్త చరిత్ర..

ఒకప్పుడు చిన్న రాకెట్ కోసం అగ్రరాజ్యం అమెరికా వైపు చూసిన భారత్, ఇప్పుడు అదే అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని తన సొంత గడ్డపై నుంచి నింగిలోకి పంపే స్థాయికి ఎదిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ఈ చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇటీవల నాసా-ఇస్రో సంయుక్త ‘నైసర్’ మిషన్‌ను విజయవంతం చేసిన ఉత్సాహంతో, మరో కీలక ఘట్టానికి నాంది పలుకుతోంది.   చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్…

National

ట్రంప్‌పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన రాజ్‌నాథ్ సింగ్..

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన నేపథ్యంలో, కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. “కొందరు ‘బాస్’లు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేగాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనమే అందరికీ బాస్ అయితే, భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని వారు అనుకుంటున్నారు?” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.…

National

ఫాస్టాగ్ వన్ ఇయర్ పాస్… వివరాలు ఇవిగో..!

వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక శుభవార్త అందించింది. టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ‘ఫాస్టాగ్ వార్షిక పాస్’ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పథకం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి పదేపదే రీఛార్జ్ చేసుకునే శ్రమను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.   ఈ వార్షిక పాస్ ధరను రూ. 3,000గా నిర్ణయించారు.…

National

భారత పర్యటనకు వస్తున్న పుతిన్..!

రష్యా నుంచి ముడిచమురు కొంటున్నారనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఏదో ఒక విధంగా భారత్ ను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా చూడాలనే యోచనలో ట్రంప్ ఉన్నారు. అయితే, ఇవేవీ భారత్-రష్యా స్నేహ బంధంపై ప్రభావం చూపలేకపోయాయి. రష్యా అధినేత ట్రంప్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. ప్రస్తుతం దోవల్…

National

అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్ గా భారత్..

నాణ్యమైన వైద్య సేవలకు భారతదేశం ప్రపంచస్థాయి చిరునామాగా మారుతోంది. వైద్యం కోసం మన దేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్ వరకు) 1,31,856 మంది విదేశీయులు వైద్య చికిత్సల నిమిత్తం భారత్‌ను సందర్శించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం నాడు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.   ఈ ఏడాది…