మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. హాంకాంగ్, సింగపూర్లో మళ్లీ విజృంభిస్తున్న కేసులు..
ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది. హాంగ్కాంగ్లో ప్రస్తుతం వైరస్ కేసులు ‘చాలా ఎక్కువగా’ ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి అల్బర్ట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవల కాలంలో హాంగ్కాంగ్లో శ్వాసకోశ నమూనాల్లో…

