భారత్, పాక్ సెమీస్ పోరుపై నీలినీడలు.. తప్పుకున్న స్పాన్సర్..!
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా నిన్న వెస్టిండీస్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ విజయం సాధించి సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక, సెమీస్లో దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడాల్సి ఉంది. అయితే, ఈ సెమీస్ పోరుకు భారీ అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే పాక్తో భారత్ ఆడే విషయంపై సందిగ్దత నెలకొనగా.. తాజాగా ఈ టోర్నీ స్పాన్సర్స్ ఈజ్మైట్రిప్ ఈ మ్యాచ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం…