రజత పతకాలు సాధించిన స్విమ్మర్ ‘గంధం క్వీని’
అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన గంధం క్వీని విక్టోరియా సత్తా చాటింది. ఆమె రెండు రజత పతకాలు సాధించింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈనెల 24నుంచి 27వరకు జరిగిన ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల నుంచి హాజరయ్యారు. భారతదేశం తరపున స్వీమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గంధం క్వీని 200 మీటర్ల మహిళల విభాగంలో పాల్గొని 2వ స్థానం నిలిచి మరో రజత పతకం కైవసం…