TELANGANA

TELANGANA

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా: హరీశ్ రావు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, వారి కుట్రలు ఇప్పుడు…

TELANGANA

తెలంగాణ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేసిన ఎన్నికల సంఘం..! ఎందుకంటే..?

తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అనూహ్యంగా బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఎన్నికల నోటిఫికేషన్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది.   స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును అనుసరించి, ఎన్నికల ప్రక్రియను…

TELANGANA

రేపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయింది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.   రేపు ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్..

చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ఈ ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరిప్ లను విక్రియించకూడదని.. తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం జరిగింది.   ఉపశమనానికి వేసిన దగ్గు మందు చిన్నారుల ప్రాణం తీసింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందు మరణాలతో కేంద్రం అలర్ట్…

TELANGANA

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ఇప్పుడు లీగల్ ఫైట్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ జీవోపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దానిని విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది ఉన్నత న్యాయస్థానం.   హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్న.. హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషన్‌ను ప్రశ్నించింది కోర్టు. హైకోర్టులో స్టే…

TELANGANA

కవిత సమక్షంలో బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు..

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మరో నేత.. తెలంగాణ జాగృతిలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నంగవత్ రాజేశ్ నాయక్, సోమవారం తెలంగాణ జాగృతిలో చేరికయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.   కవిత ఆహ్వానం తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన రాజేశ్ నాయక్ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందని.. ఉద్యమకారులమంతా కలిసి సామాజిక…

TELANGANA

ఆర్టీసీ ఛార్జీల పంపుపై కేటీఆర్ విమర్శలు..!

జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని సిటీ బస్సు ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. సిటీ బస్సు ఛార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.   సామాన్యులపై ఛార్జీల భారం ‘పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో, ప్రతి…

TELANGANA

జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? లిస్ట్‌లో ఆ నలుగురు..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి, నలుగురు ఆశావహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్ఠానానికి పంపనుండటంతో, ఇప్పుడు అందరి దృష్టీ ఢిల్లీ పెద్దల నిర్ణయంపైనే నిలిచింది.   పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి,…

TELANGANA

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తి లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి..

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తి లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి వినియోగదారుల సంఘాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. సాగునీటి సంఘాలతో చెరువులు, కాలువలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.   మొదట చెరువులతో ప్రారంభించి పెద్ద ప్రాజెక్టుల వరకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ప్రతి…

TELANGANA

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దసరా కానుక.. రూ.1.25 కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా..

దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ వర్తించేలా, ఎలాంటి ప్రీమియం భారం లేకుండా రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.   ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)తో జీహెచ్ఎంసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు…