TELANGANA

TELANGANA

జీవ‌న్‌రెడ్డి కామెంట్స్‌పై భ‌గ్గుమంటున్న కాంగ్రెస్‌..

పార్టీ మారితే అంతే. ఏ పార్టీలో ఉంటే ఆ పాటందుకోవాలె. అదే బ‌తుకుదెరువు. బ‌త‌క‌నేర్చిన తెలివి. జీవ‌న్‌రెడ్డి ఇవాళ ఇలా బీఆరెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నాడో లేదో.. ఓ ప్ర‌క‌ట‌నైతే తెగ వైర‌ల్ అయిపోతా ఉంది. కేంద్రంలో మోడీ పాల‌న‌ను మెచ్చుకున్నాడు మ‌రి జీవ‌న్‌రెడ్డి.   ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో ఉన్నా ఇసుమంత కూడా జాలి లేదు రాహుల్ మీద జీవ‌న్‌కు అని కాంగ్రెసోళ్లు తెగ ఫైర్ అయిపోతున్నారు ఆయ‌న మీద‌. కేంద్రంలో బీజేపీ బెట‌ర్‌.. ఇక్క‌డ కేసీఆర్…

TELANGANA

హస్తం వీడి కారు ఎక్కిన జీవన్ రెడ్డి..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ (BRS)లో చేరునున్న‌ట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న జీవన్ రెడ్డి చేరికను పార్టీ బలోపేతానికి ఒక కీలక మలుపుగా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.   గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ, తాను బీఆర్ఎస్…

TELANGANA

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం..! సీఎం రేవంత్‌ రెడ్డితో టిమ్ రైఫిల్ భేటీ..

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ (TLMAL) రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులు అలాగే నూతన ప్రాజెక్టుల స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు.   తెలంగాణలో ఉన్న అత్యాధునిక…

TELANGANA

సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ..? వారికి చెక్ పెట్టినట్లేనా..?

తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజుగా ఈనెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ.. ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు.…

TELANGANA

200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు..

అక్రమంగా గడించిన వేల కోట్ల రూపాయలతో బీఆర్‌ఎస్ పార్టీ ఏకంగా 200 యూట్యూబ్ ఛానెళ్లను కొనుగోలు చేసి, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా బీఆర్‌ఎస్ బురదజల్లుతోందని, వీటిని కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.   కేవలం ఇంట్లో కూర్చుంటే అధికారం రాదని, ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ అనే నిజాన్ని గుర్తించి ఫీల్డ్‌లోకి వెళ్లి పని చేయాలని సూచించారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు,…

TELANGANA

బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్….

పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహనిర్బంధాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఆయన ‘పిరికిపంద చర్యలు’గా అభివర్ణించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి…

TELANGANA

2034 వరకు నేనే .. అందరి లెక్కలు తేలుస్తా.. ఆదిలాబాద్ గడ్డపై రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్యాన్ని వీడి, ఆదిలాబాద్‌ను పారిశ్రామిక, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.   గత పాలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి, అంచనాలు పెంచి వేల కోట్లు వృధా చేశారని, కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని సీఎం విమర్శించారు.…

TELANGANA

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ..! రేపే కోర్టు తీర్పు..

మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మల భవితవ్యంపై ఉప్పరపల్లి కోర్టులో కీలక వాదనలు ముగిశాయి. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్.. తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న…

TELANGANA

భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సర్వే నంబర్ల వారీగా డిజిటల్ సర్వే పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించకూడదని భావిస్తోంది. దీనికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ భూ భారతిలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూమికి సంబంధించిన దస్తావేజులు ఉంటే ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ,క్షేత్రస్థాయిలో ఆ భూమి ఉందా? సరిహద్దులు సక్రమంగా ఉన్నాయా? అనేది రిజిస్ట్రేషన్…

TELANGANA

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి..! సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

బాసర క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి సుమారు రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.   ముఖ్యమంత్రి రేవంత్…