“ముఖ్యమంత్రి రౌడీలా మాట్లాడుతున్నారు”: రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఫిర్యాదు!
ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు కలిసి కూల్చివేయాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య హింసను ప్రేరేపించేలా ఒక రౌడీ మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ…

