TELANGANA

TELANGANA

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికో చెప్పేసిన కేటీఆర్..!

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు.   ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రెండు నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం…

TELANGANA

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు: హరీశ్ రావు..

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి రావడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నదాతలకు ఈ కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు.   బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దర్జాగా బతికిన రైతు.. నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం…

TELANGANA

సింగరేణికి ‘బంగారు’ అవకాశం.. కర్ణాటకలో పసిడి గనుల అన్వేషణకు లైసెన్స్..

సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు.   సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం…

TELANGANA

జీఎస్టీ కౌన్సిల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు అంటూ కేంద్రం ప్రచారం చేసుకుంటోందని, కానీ ధరల తగ్గింపుపై చిత్తశుద్ధి లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం…

TELANGANA

ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.   కాసేపట్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

TELANGANA

కులగణనను వక్రీకరిస్తే బీసీలకు న్యాయం జరగదు-సీఎం రేవంత్

కుల గణనను వక్రీకరిస్తే ఇంకో వందేళ్లయినా బీసీలకు న్యాయం జరగదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సర్వే చేయలేదన్నారు. కులగణను పకడ్బంధీగా చేశామని, తప్పులు దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కులగణన చేశామని, గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలాశాసనమన్నారు.   సర్వాయి సర్దార్ పాపన్నకు సరైన గౌరవం దక్కాలన్నారు. త్వరలో ఆ రోజు రాబోతుందన్నారు. ఆయన గొప్ప యోధుడని కొనియాడారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను…

TELANGANA

హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం..! క‌రెంట్ షాక్ తో ఐదుగురు మృతి..

హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌డంతో క‌రెంట్ షాక్ కార‌ణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి రామంతాపూర్‌లోని గోకులేన‌గ‌ర్‌లో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా ర‌థాన్ని ఊరేగించారు. అయితే, ర‌థాన్ని లాగుతున్న వాహ‌నం చెడిపోవ‌డంతో దాన్ని ప‌క్క‌కు నిలిపివేసిన యువ‌కులు.. ర‌థాన్ని చేతుల‌తో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలాయి. దాంతో ర‌థాన్ని లాగుతున్న…

TELANGANA

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం..

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుంగిన ఏడో బ్లాక్‌ను పునరుద్ధరించేందుకు.. అవసరమైన చర్యలను ప్రారంభించింది. దీనికి కావల్సిన మరమ్మతులు చేయడానికి డిజైన్ల రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌కు అప్పగించారు. అయితే ఈ సంస్థ రామగుండం సీఈ నుంచి సమాచారాన్ని తెలుసుకుని ఒక నివేదికను పంపించింది. దీంతో ఈఎన్సీ అంజద్ హూస్సేన్ తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని పనుల…

TELANGANA

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై బండి సంజయ్ సంచలన వాక్యాలు..!

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అంటే, మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.…

TELANGANA

విమర్శించడం లేదంటూనే రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇటీవల తరచూ విరుచుకుపడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సొంతపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో గత రాత్రి నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘పదవులూ మీకే.. పైసలూ మీకేనా?’ అని నిలదీశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ముఖ్యమంత్రి ఇస్తేనే ఆ బిల్లు వస్తుందని అన్నారు. కాబట్టే సీఎంను ప్రశ్నిస్తున్నానని,…