TELANGANA

TELANGANA

2024-25 వార్షిక బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం..

2024-25 వార్షిక బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు.   తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ తయారు చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలని సీఎం అధికారులకు సూచించారు. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్‌…

TELANGANA

కాంగ్రెస్ గ్యారెంటీలు ఆరు.. మీకు దక్కాలంటే ఇలా చేయండి..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇస్పటికే రెండు హామీల అమలు మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే(డిసెంబర్‌ 9 నుంచి) ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో…

TELANGANA

బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి ఇద్దరు బీజేపీ అగ్రనేతలు

పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీల సమాయత్తం.. ఈసారి లోక్‌సభ ఎన్నికలు నెల ముందే రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ కూడా లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో బీజేపీ కీలక సమావేశం డిసెంబర్‌ 28న కొంగరకలాన్‌లో జరుగనుంది. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా…

TELANGANA

రేవంత్‌కు ‘రేషన్‌’ టెన్షన్‌..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పాలనలో తన మార్కు చూపించేందుకు కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే.. గ్యారంటీలను అమలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. అయితే, ముందుగా ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డులు రద్దు చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. వాటిస్థానంలో డిసెంబర్‌…

TELANGANA

మరో యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్‌.. స్వయంగా రంగంలోకి గులాబీ బాస్‌!

సిట్టింగుల మార్పు..? తెలంగాణలో ప్రస్తుతం బీఆరెస్‌కు 9 మంది సిటింగ్‌ ఎంపీలు ఉన్నారు. వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిటింగ్‌లకు సీట్లు ఇవ్వడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో కేసీఆర్‌ ఉన్నారు. అందుకే సిటింగ్‌ ఎంపీలలో మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్‌లకు మాత్రం టికెట్‌ కన్ఫర్మ్‌ చేశారని సమాచారం. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి…

TELANGANA

రేవంత్ కు తొలి పరీక్ష…

అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వని హామీలు అంటూ ఏమి లేవు. ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. వారి అభిమానాన్ని పొందగలిగారు. తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎలా ముందుకెళ్తారో నన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ పథకాలను అమలు చేయడం ఒక ఎత్తు అయితే అభివృద్ధిని కొనసాగించడం కూడా ఒక ఎత్తు. సంక్షేమ పథకాల ఖర్చు ఒక ఎత్తు అయితే.. పడిపోతున్న ఆదాయాన్ని నిలబెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీపై…

TELANGANA

ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీలుగా మంత్రులు..

తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు దామోదర రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు.   రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ…

TELANGANA

మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా అందాలంటే – తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయిదు పథకాలకు సంబంధించి దరాఖాస్తులను స్వీకరించేందుకు మార్గదర్శకాలు సిద్దం చేసింది. రేషన్ కార్డులు లేని వారి నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రజలు ఒక్కో పథకానికీ ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించింది.   దరఖాస్తుల స్వీకరణ: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో.. ఐదింటినీ…

TELANGANA

రుణమాఫీపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తున్నారు. తాజాగా రేషన్‌ కార్డుల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరో కీలక హామీ అమలుపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వస్తూ రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి రేవంత్‌ ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.…

TELANGANA

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

ప్రతీ పథకానికి రేషన్‌కార్డే ప్రాతిపదిక.. ప్రభుత్వ పథకాలను పొందాలంటే రేషన్‌ కార్డుల అవసరం ఉండగా.. కొత్త రేషన్‌ కార్డులు తీసుకోడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…