TELANGANA

TELANGANA

సీఎం రేవంత్‌రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని ఎందుకు లేఖ రాసింది.. అందులో ఏముంది?

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో వరుసగా ఒక్కో గ్యారంటీని అమలు చేసుకుంటూ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాధనంతో నిర్మించిన అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ప్రజాభవన్‌లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు,అభ్యర్థలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను…

TELANGANA

తెలంగాణ వాహనదారులకు ఇది గొప్ప న్యూస్‌..!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు చలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్‌ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది.   రెండు కోట్లకుపైగా పెండింగ్‌.. నవంబర్‌ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్‌ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ…

TELANGANA

ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఆరో రోజైన గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్లు సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికి భయపడేది లేదని.. కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు.   మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఎంత…

TELANGANA

ట్రాఫిక్‌ చలానాలపై మరోమారు రాయితీ

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ మరోమారు సన్నద్దమవుతోంది. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలయింది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.

TELANGANA

రైతు బంధు పై కాంగ్రెస్ మాట.. ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం బాట..

అధికారంలోకి రాగానే వెంటనే రైతు భరోసా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అప్పట్లో ఎన్నికల సంఘం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఒప్పుకుంది. అయితే ప్రభుత్వం ఖాతాలో డబ్బులు లేకపోవడంతో రైతుబంధు ఆగిపోయింది. ఆ తరుణంలో రైతులకు సంబంధించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసాను ఎకరానికి 2500 పెంచి వేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై అప్పట్లో అటు భారత రాష్ట్ర సమితి ఇటు…

TELANGANA

తెలంగాణలో కరోనా కలకలం.. ఒకరు మృతి..

2020లో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. 2021లోనూ కొనసాగింది. వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ప్రపంచాన్ని వణికించింది ఈ మహమ్మారి. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ తాజాగా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ వందలాది కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.   తాజాగా తెలంగాణలో కేసులు…

TELANGANA

రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ప్రజలకు మరో రెండు గ్యారెంటీలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా మారాయి ఆరు గ్యారంటీలు. తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీతో ఈ ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది టీకాంగ్రెస్‌. మరోవైపు 42 పేజీల మేనిఫెస్టో, జాబ్‌ క్యాలెండర్‌ హామీ, పెన్షన్ల పెంపు, రుణమాఫీ, రైతుభరోసా లాంటి హామీలు అన్నివర్గాలను కాంగ్రెస్‌ వైపు మళ్లించాయి. దీంతో 64 సీట్లతో కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై…

TELANGANA

కేటీఆర్‌ సంచలన ట్వీట్‌..కాంగ్రెస్‌తో ఫైట్‌కు కేటీఆర్‌ సై.. వైరల్ వీడియో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌.. అధికార కాంగ్రెస్‌తో సమరానికి సై అంటోంది. అసెంబ్లీ తొలి సమావేశంలోనే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. తన ప్రసంగంలో దూకుడు ప్రదర్శించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తమకు 57 మంది బలం ఉందని, మీకు 65 మంది ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని…

APTELANGANA

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2, 4 డిగ్రీలకు పడిపోయాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

TELANGANA

రైతుబంధులో కీలక మార్పులు.. కండీషన్స్ అప్లై.. వీరే అర్హులు..!!

పథకంపై పునఃసమీక్ష.. ప్రభుత్వం రైతుబంధు పథకం పునఃసమీక్షిస్తోంది. ఈ యాసంగి సీజన్‌ వరకూ గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులూ లేకుండా రైతుబంధు పంపిణీ చేసి.. వచ్చే వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతుభరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా.. పది ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వనున్నట్టు సమాచారం.   అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే.. 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది.…