సీఎం రేవంత్రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని ఎందుకు లేఖ రాసింది.. అందులో ఏముంది?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనదైన విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో వరుసగా ఒక్కో గ్యారంటీని అమలు చేసుకుంటూ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనంతో నిర్మించిన అధికారిక నివాసం ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు,అభ్యర్థలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను…

