TELANGANA

APTELANGANA

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2, 4 డిగ్రీలకు పడిపోయాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

TELANGANA

రైతుబంధులో కీలక మార్పులు.. కండీషన్స్ అప్లై.. వీరే అర్హులు..!!

పథకంపై పునఃసమీక్ష.. ప్రభుత్వం రైతుబంధు పథకం పునఃసమీక్షిస్తోంది. ఈ యాసంగి సీజన్‌ వరకూ గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులూ లేకుండా రైతుబంధు పంపిణీ చేసి.. వచ్చే వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతుభరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా.. పది ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వనున్నట్టు సమాచారం.   అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే.. 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది.…

TELANGANA

మేడారం కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ప్లానింగ్ ఇదీ..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్‌ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణ మహిళలందరికీ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ఈ క్రమంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న మేడారం జాతర ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తోంది.  …

APTELANGANA

పవన్ కళ్యాణ్ పై బర్రెలక్క హాట్ కామెంట్స్..

ఏపీ సీఎం జగన్ ఆ తరహా ఆరోపణలు చేసేసరికి జనసేన సైతం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2014 తెలంగాణ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. అప్పుడు వైసీపీ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్లను గణాంకాలతో సహా జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.   అయితే తాజాగా ఈ ఘటనపై బర్రెలక్క స్పందించారు. ఓ ప్రైవేటు…

TELANGANA

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క..

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైంది. తాజాగా, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు చెప్పారు. అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రిగా తొలి సంతకం చేశారు సీతక్క.   ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రూపొందించిన…

TELANGANA

హెచ్ఎండీఏ జేసీగా ఆమ్రపాలి బాధ్యతలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి కాటా (Amrapali kata) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతోపాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి అభినందించారు.   ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ…

TELANGANA

ప్రజా భవన్ ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం!!

తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి దూకుడుగా పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆటోడ్రైవర్లతో నిరసన సెగ తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని అందిస్తున్నారు.   ఈ క్రమంలో ఆటోలకు ఊహించని విధంగా గిరాకీ తగ్గింది. దీంతో ఈ పథకం ప్రారంభం…

TELANGANA

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర!!

2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో నేటి నుండి యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, రాజ‌స్థాన్,…

TELANGANA

20 లక్షల రేషన్ కార్డుల తొలగింపు.. విచారణ చేయాలని డిమాండ్..

తెలంగాణలో వివిధ కారణాలతో ఏకపక్షంగా 20 లక్షల రేషన్‌కార్డుల తొలగింపుపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న అసీమ్‌ అనే ఎన్‌జీవో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద డేటా డిజిటలైజేషన్ తర్వాత, సాంకేతికత ఆధారిత గుర్తింపుతో కలిపి దాదాపు 2 లక్షల రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని తెలిపింది.   క్షేత్ర…

TELANGANA

బీజేపీ ఎంపీగా బరిలో మందకృష్ణ – నియోజకవర్గం ఫిక్స్..!?

తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో నూ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి కోలుకొనే విధంగా కార్యాచరణ ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్లు..సీట్లతో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా సీట్ల ఖరారులో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.   బీజేపీ కొత్త లెక్కలు :…