గుంటూరులో మిర్చి రైతుల ఆందోళన..
మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట నల్లపాడు రోడ్డుపై రైతులు బైఠాయించి దాదాపు మూడు గంటల పాటు నిరసన తెలిపారు. వ్యాపారుల మాయాజాలంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి యార్డుకు సరుకు తీసుకొస్తే కొనుగోలు చేస్తారన్న నమ్మకం కూడా లేకుండా పోయిందని వాపోయారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా…