TELANGANA

TELANGANA

తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్..

తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.   అంగన్వాడీ టీచర్ల…

TELANGANA

అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. శనివారం నాడు హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్‌లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.   ఈ ఆపరేషన్‌లో భాగంగా, భూకబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎం.ఏ.…

TELANGANA

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం

తెలంగాణ మాసీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి.. తన పాత మిత్రుడిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే పంపాడు.. మీతో కలిసి పని చేయమని” అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం జీవన్ రెడ్డి తన కుమారులు..…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డి పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

సిద్దిపేట వేదికగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోల్పోయిందని ఆయన ఆరోపించారు.   గతంలో పీసీసీ నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రులు నడుచుకునే…

TELANGANA

జీవ‌న్‌రెడ్డి కామెంట్స్‌పై భ‌గ్గుమంటున్న కాంగ్రెస్‌..

పార్టీ మారితే అంతే. ఏ పార్టీలో ఉంటే ఆ పాటందుకోవాలె. అదే బ‌తుకుదెరువు. బ‌త‌క‌నేర్చిన తెలివి. జీవ‌న్‌రెడ్డి ఇవాళ ఇలా బీఆరెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నాడో లేదో.. ఓ ప్ర‌క‌ట‌నైతే తెగ వైర‌ల్ అయిపోతా ఉంది. కేంద్రంలో మోడీ పాల‌న‌ను మెచ్చుకున్నాడు మ‌రి జీవ‌న్‌రెడ్డి.   ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో ఉన్నా ఇసుమంత కూడా జాలి లేదు రాహుల్ మీద జీవ‌న్‌కు అని కాంగ్రెసోళ్లు తెగ ఫైర్ అయిపోతున్నారు ఆయ‌న మీద‌. కేంద్రంలో బీజేపీ బెట‌ర్‌.. ఇక్క‌డ కేసీఆర్…

TELANGANA

హస్తం వీడి కారు ఎక్కిన జీవన్ రెడ్డి..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ (BRS)లో చేరునున్న‌ట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న జీవన్ రెడ్డి చేరికను పార్టీ బలోపేతానికి ఒక కీలక మలుపుగా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.   గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ, తాను బీఆర్ఎస్…

TELANGANA

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం..! సీఎం రేవంత్‌ రెడ్డితో టిమ్ రైఫిల్ భేటీ..

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ (TLMAL) రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులు అలాగే నూతన ప్రాజెక్టుల స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు.   తెలంగాణలో ఉన్న అత్యాధునిక…

TELANGANA

సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ..? వారికి చెక్ పెట్టినట్లేనా..?

తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజుగా ఈనెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ.. ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు.…

TELANGANA

200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు..

అక్రమంగా గడించిన వేల కోట్ల రూపాయలతో బీఆర్‌ఎస్ పార్టీ ఏకంగా 200 యూట్యూబ్ ఛానెళ్లను కొనుగోలు చేసి, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా బీఆర్‌ఎస్ బురదజల్లుతోందని, వీటిని కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.   కేవలం ఇంట్లో కూర్చుంటే అధికారం రాదని, ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ అనే నిజాన్ని గుర్తించి ఫీల్డ్‌లోకి వెళ్లి పని చేయాలని సూచించారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు,…

TELANGANA

బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్….

పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహనిర్బంధాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఆయన ‘పిరికిపంద చర్యలు’గా అభివర్ణించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి…