కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్: కాంగ్రెస్ గూటికి వడ్డేపల్లి విజేతలు.. సీఎం రేవంత్ సమక్షంలో చేరిక!
జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ అనూహ్యంగా కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధించారు. కవిత ఈ విజయాన్ని తన రాజకీయ బోణీగా భావించిన కొద్ది గంటలకే, గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఒక్క వార్డు మాత్రమే…

