TELANGANA

TELANGANA

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక కాటన్ మిల్లు గిడ్డంగిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు ఎగిసిపడటంతో గోదాములో నిల్వ ఉన్న సరుకు పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న మ్యాట్రెస్ కంపెనీకి కూడా వ్యాపించాయి.   స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా…

TELANGANA

కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్ పై విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో భేటీ అయిన ఆమె, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై రాజీకయంగా అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   “పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రజల్లోకి పోలేదు? ఇప్పుడు పాదయాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ పాదయాత్ర ప్రస్తావనను ఎద్దేవా చేస్తూ,…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని వేసింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది.   కల్నల్ పరీక్షిత్ మెహ్రా నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణులు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం…

TELANGANA

తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ తేజస్వి సూర్యపై నిప్పులు చెరిగారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అత్యంత అజ్ఞానంతో కూడుకున్నవని, అవి ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని పొన్నం పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని అవమానించినందుకు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని…

TELANGANA

తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్..

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై ఏమాత్రం గౌరవంలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకార పూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.   బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమర వీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా…

APNationalTELANGANA

ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు.. డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన..

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు తగ్గవని, పైగా సంఖ్యాపరంగా, నిష్పత్తి పరంగా కూడా పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని నిర్దిష్ట లెక్కలతో సహా వివరించారు.   మహిళా…

TELANGANA

చర్చకు సిద్ధమా..? మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు స్ట్రాంగ్ కౌంటర్..

సినీ గాయకురాలు మంగ్లీ చుట్టూ ముసురుకున్న ఆర్థిక మోసం వివాదం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. పరస్పర ఫిర్యాదులు, సవాళ్లతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడుల స్కామ్‌లో తన ప్రమేయం లేదని మంగ్లీ వాదిస్తుంటే, ఆమె ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని న్యాయవాది సింగపోగు సుబ్బారావు గట్టిగా వాదిస్తున్నారు. బుధవారం ఈ ఇరు పక్షాలు డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.   డీజీపీ కార్యాలయం వద్ద…

TELANGANA

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కసరత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కార్యకర్తలకు త్వరలోనే శుభవార్త అందనుంది. బుధవారం సాయంత్రం సీఎంతో పార్టీ కీలక నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై సమగ్రంగా చర్చించారు.   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకులకు…

TELANGANA

ఆర్టీసీలో సమ్మె సైరన్..! 22 నుంచి సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ..

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 21 అర్ధరాత్రి..22 (బుధవారం)నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసు లు ఇచ్చామని ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 31 డిమాండ్లను పెట్టామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డిలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ తిరిగి టీఆర్ఎస్ గా మారుబోతుందా..?

బీఆర్ఎస్ పార్టీ ఇక టీఆర్ఎస్ గా మారుబోతుందా అనే చర్చ జరుగుతుంది. పార్టీ వరుస ఓటములతోనే అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ కేడర్ సైతం టీఆర్ఎస్ గా ఉంటేనే ప్రజల ఆదరణ ఉంటుందని, అది పార్టీ పేరులోంచి తొలగించిన తర్వాతే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుందని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు పార్టీ కేడర్ ఒత్తిడి, మరోవైపు రాజకీయాల్లో గడ్డుకాలం నేపథ్యంలో మళ్లీ పార్టీ మార్పు చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో విజయం…