ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్ట్ నేతల భేటీ: ‘తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు’.. ప్రభుత్వ సరెండర్ పాలసీపై ప్రశంసలు!
ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి (దేవ్జీ), నూనె నరసింహారెడ్డి తదితరులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో ప్రభుత్వ సహాయం, లొంగిపోయిన వారికి పునరావాసం మరియు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందని దేవ్జీ ప్రశంసించడమే కాకుండా, ఆధునిక ప్రపంచంలో తుపాకీ సిద్ధాంతం కంటే ప్రజాస్వామ్య మార్గమే శరణ్యమని తాము నమ్ముతున్నట్లు…

