TELANGANA

TELANGANA

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం విచారణ, ఉద్యోగుల బకాయిలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేసింది.   1. ఆర్టీసీ సమ్మెపై చర్చ – చర్చలకు పిలుపు రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం తీవ్రంగా చర్చించింది. కార్మికులు ఎవరూ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, సంయమనం పాటించాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. సమస్యల…

TELANGANA

బీజేపీలోకి జీవన్ రెడ్డి..?

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బీజేపీలోకి చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోందని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.   రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.…

TELANGANA

బీజేపీ – బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: మహేశ్ కుమార్ గౌడ్..

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు కేవలం సాంకేతికపరమైన అంశాలకే పరిమితమని, అవినీతి జరగలేదని కోర్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.   కోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కానీ, దాని విచారణను కానీ తప్పుబట్టలేదని… కేవలం నివేదిక రూపకల్పనలో అనుసరించిన విధానాన్ని మాత్రమే…

TELANGANA

చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్..

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీంతో కమిటీతో TGSRTC జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి RTC ఉద్యోగులు సమ్మెలోకి దిగనన్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంకోసం ప్రభుత్వం కమిటీ 4 వారాల సమయం కోరింది. దీంతో అందుకు ఆర్టీసీ జేఏసీ సంఘం అంగీకరించలేదు. కాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్…

TELANGANA

కుషాయిగూడలో రైతుల మహా ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు కుషాయిగూడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ పేరుతో తమకు సంబంధించిన సుమారు రూ.250 కోట్ల నష్టపరిహారం డబ్బులు మోసపూరితంగా కొల్లగొట్టారని ఆరోపించారు.సుమారు 25 గ్రామాలకు చెందిన వందలాది మంది బాధిత రైతులు కుషాయిగూడ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి…

TELANGANA

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..

కాళేశ్వరంలోని ఆలయ అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.198 కోట్లతో చేపట్టబోయే ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.   అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని, ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి బ్యారేజీని పరిశీలిస్తారు. ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి కాటారం మండలం నస్తూరిపల్లికి…

TELANGANA

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం..

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి హైదరాబాద్ సిటీవాసులకు ఉచితంగా MMTS సేవలు అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వేశాఖతో మంతనాలు   హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని…

TELANGANA

ప్రజల్లోకి గులాబీ అధినేత కేసీఆర్..!

గులాబీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాఆశీర్వాద సభ పేరుతో మళ్లీ ఎంట్రీ అవుతున్నారు. ఇప్పటివరకు మౌనంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆయన ఎవరిపై మాటల తూటాలు సందిస్తారనే ఆసక్తి ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.   ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలు కానుంది. కొంతకాలంగా కేసీఆర్ రాజకీయాలపై తనదైనశైలీలో విమర్శనాస్త్రాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఘాటు వ్యాఖ్యలు లేవు. తప్పులను…

APCINEMATELANGANA

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత… హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.   వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షించిన వైద్యులు,…

TELANGANA

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఇతర అధికారులతో విమానాశ్రయాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష జరిపారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలను వేగవంతం…