TELANGANA

TELANGANA

తెలంగాణలో సారా దుకాణాలు మళ్లీ తెరవాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన డిమాండ్

తెలంగాణలో సారా (Sara) దుకాణాలను తిరిగి ప్రారంభించాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ‘బాంబు’ పేల్చబోతున్నానని ప్రకటించారు. గతంలో స్వచ్ఛమైన సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించేవారని, కానీ ప్రస్తుతం కల్తీ మద్యం తాగి 80 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వింత వాదనను…

TELANGANA

ఐటీ కొలువులో తీవ్ర పని ఒత్తిడి: హైదరాబాద్‌లో కర్ణాటక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక 32 ఏళ్ల మనుశ్రీ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొండాపూర్‌లోని సుమధుర అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె, తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి వల్లే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మనుశ్రీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి. ఆదివారం…

TELANGANA

తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 5000 కోట్లు విడుదల..

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2 వరకు భూసేకరణ పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి సచివాలయంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ఉన్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.   సింగూర్…

TELANGANA

మూసీ పేరిట విధ్వంసం..! ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్..

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్ లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ‘మూసీ బ్యూటిఫికేషన్’ కాదని.. అది ‘లూటిఫికేషన్’ అని దుయ్యబట్టారు. నాగోల్ లో ఉన్న ఎస్టీపీని గురువారం పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసి మోడల్ ని పరిశీలించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు. రూ.16 వేల కోట్లతో…

TELANGANA

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ..

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

TELANGANA

రూ. 600ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమికి హైడ్రా రక్షణ..

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న గంధంగూడ ప్రాంతంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించింది. సుమారు రూ.600 కోట్ల విలువ చేసే 6.30 ఎకరాల స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.   రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 86/పి లో ఉన్న 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని సీవరేజ్…

TELANGANA

ప్రపంచానికి ఇరాన్ చమురు సెగ.. హార్ముజ్ జలసంధి మూసివేతm.!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయలాంటి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది.   ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్‌కు సీనియర్ సలహాదారు అయిన బ్రిగేడియర్…

TELANGANA

రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ.. బుధవారం ఢిల్లీకి సీఎం రేవంత్..

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి రెండు స్థానాలకు పేర్లను ఖరారు చేయనున్నారు.   అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రతిపాదనలతో ఢిల్లీకి రావాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయం లాంజ్‌లో రాహుల్ గాంధీ, సీఎం…

TELANGANA

సౌదీ బస్సు ప్రమాద బాధితులకు ఊరట: బాధితులకు పరిహారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

గతేడాది నవంబర్‌లో సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ప్రమాదంలో మరణించిన 44 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో పంపిణీ చేశారు. విదేశాల్లో జరిగే ప్రమాదాలకు సాధారణంగా ప్రభుత్వాలు పరిహారం చెల్లించకపోయినా, బాధితుల దయనీయ స్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో…

TELANGANA

శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు: జలమండలి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

కోకాపేటలోని విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూముల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఠానికి కేటాయించిన స్థలంలో జలమండలి (HMWSSB) చేపట్టిన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. జలమండలికి ఆ భూములను కేటాయిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ భూముల్లో జలమండలి నిర్మాణ పనులు ప్రారంభించడాన్ని శారదా పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై…