TELANGANA

TELANGANA

శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు..

ప్రజలను భాగస్వాములను చేస్తూ ఫ్యూచర్‌ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సిటీ నిర్మాణం సాధ్యమవుతుందని సీపీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నగరం భావితరాలకు వరంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం అంత సులభం కాదని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.   కొంత మంది ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం విషయంలో…

TELANGANA

బీఆర్ఎస్ ఓ ‘చచ్చిన శవం’.. కవిత పార్టీ అవసరమే లేదు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని ఆయన అన్నారు. “చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు.. బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది” అంటూ విరుచుకుపడ్డారు.     పదేళ్ల అహంకార పూరిత పాలన వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, దాని మనుగడే ప్రశ్నార్థకమైందని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కల్వకుంట్ల…

TELANGANA

కవిత స్థాపించిన ‘టీఆర్ఎస్’పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు .

తన సోదరి కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ గురించి చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారని, వాటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.   తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది మేమే…

TELANGANA

ఇక మా టైం మొదలైంది.. కవిత ట్వీట్ వైరల్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె, ఆ తర్వాత చేసిన తొలి ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది” అంటూ ఎక్స్‌లో ఆమె పోస్టు పెట్టారు.   శనివారం హైదరాబాద్‌లోని మునీరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కవిత తన పార్టీ పేరును అధికారికంగా…

TELANGANA

ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలి-: కేటీఆర్..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలు ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జెండా వందనం చేసి వేడుకలు జరపాలని అన్నారు.   ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వాస్తవానికి ప్లీనరీ నిర్వహించాల్సి…

TELANGANA

కవిత కొత్త పార్టీ.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ఆవిర్భావం..;

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌)’ పేరుతో తన పార్టీని ప్రకటించి, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్‌, దానిపై టీఆర్ఎస్‌…

TELANGANA

తెలంగాణకు ప్రధాని మోదీ..! మే 9న భారీ బహిరంగ సభ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో తెలంగాణ బీజేపీ ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మే 9వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించి పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభను దిగ్విజయం…

TELANGANA

కవిత కొత్త పార్టీ..! తెరవెనుక భారీ స్కెచ్..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? భారత జాగృతి అధ్యక్షురాలు కవిత తన తదుపరి రాజకీయ అడుగులను అత్యంత వ్యూహాత్మకంగా వేస్తున్నారా? అంటే తాజా పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. రాజకీయ పరిణామాలను గమనిస్తూనే సందర్భాను సారం గళం విప్పుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు తెరవెనుక రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల,…

TELANGANA

ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మికుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభంలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు…

TELANGANA

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్..

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి.   సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను…