TELANGANA

TELANGANA

నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.   రూ. 13 వేల కోట్లు.. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన…

TELANGANA

తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు..!

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యరూపం ఇచ్చారు. హైదరాబాద్ లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యాలయం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు.   నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆపై పార్టీ ఆఫీసు…

TELANGANA

నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత సంచలన నిజాలు…

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవల బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుని, సొంతంగా తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ అనే పార్టీ మనుగడలో ఉందంటే దానికి కారణం తానేనని స్పష్టం చేశారు.   తాను ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సమయంలో.. బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం…

TELANGANA

రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన కీలక కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.   “వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 30వ తేదీన మధిరలో నిర్వహించబోయే ‘రైతు సమ్మేళనం’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను నేరుగా విడుదల…

TELANGANA

వ్యవసాయంలో ఏపీకి మరో మైలురాయి ‘VB-G-RAM-G’ అమలుపై కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ…..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మరియు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ పురోగతి, ఉపాధి హామీ పథకాలపై ఇరు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు…

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధులు విడుదల చేయండి.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ..!

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు.   ప్రయాణికులకు విశేష సేవలు   హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. పెరిగిన జనాభా, నగర…

TELANGANA

71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా ‘పెద్దన్న’ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్..

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.   యూపీ, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తేలేకపోయారో రేవంత్…

TELANGANA

తెలంగాణకు అలర్ట్… జూన్ 19 నుంచి భారీ వర్షాలు..

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. జూన్ 19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవి వారం రోజుల పాటు కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…

TELANGANA

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..! ఇకపై స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్, మిడ్డే మీల్స్ స్కీమ్ ..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయనుంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా నిరంతరాయంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది.   పథకం ముఖ్య ఉద్దేశ్యం.. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం భోజనం…

TELANGANA

ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్’ల ధర్నా..! విద్యార్థులు, యువత రాక, పేపర్ లీకేజీలపై ఆగ్రహం..

దేశంలో ఎడ్యుకేషన్ విభాగం ప్రధానంగా దృష్టి సారించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది. మెట్రోపాలిటన్ సిటీలతోపాలు టైర్ -2 నగరాల్లో ఆందోళలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం శాంతియుత నిరసనలు చేపట్టింది.   హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన   హైదరాబాద్‌లో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రారంభమైంది. ఇంటర్, నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి…