TELANGANA

TELANGANA

పోక్సో కేసులో కీలక పరిణామం..! పోలీసులకు బండి భగీరథ్ లేఖ..!

బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు భగీరథ్ ఓ లేఖ పంపించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయినట్లు లేఖలో తెలిపారు. అయితే మే 15వ తేదీన సిట్ విచారణకు వస్తానని స్పష్టం చేశారు.   విచారణకు హాజరయ్యే సమయంలో కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని బండి భగీరథ్ లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారుల…

TELANGANA

బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ..

ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.   రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై కేసీఆర్ ప్రత్యేక…

TELANGANA

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం..

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, ఆరుగులు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరాలను నియమించారు. వీరి పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్రంలోని మహిళల హక్కులను పరిరక్షించడానికి, వారిపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులను అరికట్టడానికి ఏర్పాటు చేయబడిన…

TELANGANA

బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.   ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని…

TELANGANA

తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను… ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ..

తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, వారి కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని అన్నారు.   ప్రధాని మోదీ తన…

TELANGANA

తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా తెలంగాణలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.   ప్రధాని ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టుల వివరాలు ఇవి: హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్: ఇందులో భాగంగా సూరారం నుంచి మహబూబ్‌నగర్…

TELANGANA

బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు..!

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఆయనపై పోక్సో కేసు నమోదు కాగా, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని సదరు యువతి కుటుంబం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదులతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.   హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లి శుక్రవారం పేట్‌బషీరాబాద్…

TELANGANA

నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపింది. ఆదివారం (మే 10) హైదరాబాద్‌లో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హాజరు కావాలని కోరుతూ కేంద్రం శనివారం ఆహ్వాన పత్రం అందజేసింది.   జాతీయ రహదారుల విభాగం రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ స్వయంగా ఈ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని…

TELANGANA

తెలంగాణ బీడీ కార్మికులకు గుడ్ న్యూస్.. పెరిగిన వేతనాలు..

తెలంగాణలోని లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో కార్మికుల వేతనాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు కొత్త వేతన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు.   తాజా ఒప్పందం ప్రకారం వెయ్యి బీడీలు…

TELANGANA

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు.. వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది.   దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో…