దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్వే కింద మల్టీ-లేన్ అండర్పాస్..
హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏళ్లుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద వాహనాల రాకపోకల కోసం మల్టీ-లేన్ అండర్పాస్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి అనుమతులు సాధించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. సుచిత్ర జంక్షన్ నుంచి ప్యారడైజ్…

