TELANGANA

TELANGANA

ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు..

గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే వేదికలన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి తక్షణ…

TELANGANA

మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు..

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రికి సంబంధించిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.  …

TELANGANA

హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు..! శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల దందా…

హైదరాబాద్‌లో భారీ అక్రమ గ్యాస్ సిలిండర్ల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ శ్మశాన వాటికలో అక్రమంగా నిల్వ ఉంచిన 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, ఈ దందాకు పాల్పడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.   హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సోమవారం ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు అధిక…

TELANGANA

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.   మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, ఈ నగరానికి…

TELANGANA

మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు..?: కేటీఆర్ నిలదీత..

మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్టవిరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3 వేల ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.   తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని…

TELANGANA

ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే.   మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను…

TELANGANA

కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. గోవాలోని పోండా ఉప ఎన్నిక క్యాంపెయినర్ల జాబితాలోనూ ఆయన పేరు ప్రకటించారు.   పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు.   కేరళ,…

TELANGANA

సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు.   సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే…

TELANGANA

జగిత్యాలలో హైటెన్షన్.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..

జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఉదయం టీపీసీస అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సందడి మొదలైంది. పార్టీ అంతర్గత పరిణామాలు గందరగోళానికి దారితీయడంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నేరుగా రంగంలోకి దిగింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది.   ఈ సంక్షోభ నివారణ…

TELANGANA

డీలిమిటేషన్ పై పోరాటం.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి- సీఎం రేవంత్ రెడ్డి..

“నేను దేశ రాజకీయాల్లో పనిచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మోడీ త్రీడి పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతం ఐక్యం కావల్సి ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి కేంద్రంలో తక్కువ ప్రాతినిధ్యం ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు…