TELANGANA

TELANGANA

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన..

కృష్ణమ్మ జలాలతో పాలమూరు జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ పరిశీలించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ,కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన నూతన బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత…

TELANGANA

తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ప్రమాదకర ‘ఎబోలా’ వైరస్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. సరిహద్దులు దాటి వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే లక్ష్యంగా ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెట్టడంతో పాటు, అనుమానితులకు తక్షణ చికిత్స అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది.   గాంధీ ఆసుపత్రిలో.. ఎబోలా లాంటి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని నోడల్…

TELANGANA

పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీ చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ పర్యటన పాలమూరు ప్రాంతంలో భవిష్యత్ నీటి పారుదల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. జల సౌధలో సీనియర్ అధికారులతో మంగళవారం జరిపిన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.   పాలమూరులో సీఎం పర్యటన   ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి…

TELANGANA

పవన్ సంచలన ప్రకటన..! తెలంగాణలో జనసేన పోటీ..!

హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ప్రాణాలు అర్పించారని పవన్ గుర్తుచేశారు. వారిపైన ఉన్న గౌరవంతో 12 ఏళ్ల కాలంలో తెలంగాణ పాలకుల గురించి ఒక్కమాట కూడ అనలేదని అన్నారు. తెలంగాణ అంటే తనకు అంత ఇష్టమని స్పష్టం చేశారు.   తెలంగాణపై తనకు ఉన్న ప్రేమను శంకిస్తే సహించేది…

TELANGANA

మా సహనాన్ని పరీక్షించొద్దు.. ఎంతకైనా తెగిస్తాం.. పవన్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..!

తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి అమరవీరులను అవమానించేలా ఉందంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.   తెలంగాణ మీ అయ్య జాగీరా?   తెలంగాణ గడ్డపై నిలబడి పవన్ కళ్యాణ్ తన మనసులోని ద్వేషాన్ని, వివక్షను బయటపెట్టుకున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం…

TELANGANA

తెలంగాణలో జూన్ 1 నుంచి 12 వరకు సర్కార్ ‘ప్రగతి’ ప్లాన్..?

రెండు వారాల పాటు సర్కార్ బిజీ బిజీ గా గడపనున్నది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జూన్ 1వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజుకో డిపార్ట్ మెంట్ నుంచి యాక్టివిటీస్ నిర్వహించనున్నారు. ఇందులో…

TELANGANA

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..నేడు టీజీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్లు..!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటఫికేషన్లను జారీ చేయనున్నట్టు స్పష్టంచేశారు. జూన్ లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తామని, ఇకపై ప్రతి నెలా రెండు, మూడు నోటిఫికేషన్లను జారీ…

TELANGANA

యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే తిప్పలు బంద్..! ఇకపై యాప్ లో బుకింగ్..!

ప్రజా ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావు చెపారు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా మారిందన్నారు. ఫర్టిలైజర్ యాప్ లో రియల్ టైమ్ స్టాక్ విజిబిలిటీ, రైతు వారి డిజిటల్ బుకింగ్, పంటల ఆధారిత ఎరువుల కేటాయింపు, డాష్ బోర్డు పర్యవేక్షణ, డేటా ఆధారిత సరఫరా వ్యవస్థ వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసి డిజిటల్ వ్యవసాయ పరిపాలనకు…

TELANGANA

నేడు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రెండో విడత పనులకు శంకుస్థాపన..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు జిల్లాలోని కెరమెరి మండలం కొత్తారి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘ఇందిరమ్మ ఇల్లు’ గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం స్వయంగా…

TELANGANA

సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు అతనిని అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. ఇటీవల పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. దీంతో బాల్క సుమన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన లాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని కాంగ్రెస్ నాయకులు డీజీపీకి లేఖ ఇచ్చారు.   బాల్క సుమన్ ఏమన్నారు?   బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన…