TELANGANA

TELANGANA

ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు..!

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్‌కు అదనంగా మరో 11 ప్రాజెక్టులను చేర్చి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ క్యాలెండర్‌లోని మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 36కు చేరింది. సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.   ఇటీవల కలెక్టర్ల సమావేశంలో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్…

TELANGANA

కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం..?

కాంగ్రెస్ పార్టీలో కొత్త మండల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వేగంగా కొత్త కమిటీలు ఏర్పాటు కావాలని టీపీసీసీ ఆదేశించింది. అయితే ఇప్పటికే మూడేళ్ల పాటు కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి మరోసారి అవకాశం లేదు. కొత్తోళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. కానీ కొత్తగా మండల కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వారు, అప్పటికే పార్టీలో కనీసం మూడేళ్ల పాటు కార్యకర్త గా పనిచేసి ఉండాలి. ఈసారి కమిటీల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత పారదర్శకమైన, కఠినమైన మార్గదర్శకాలను విధించింది.…

TELANGANA

పోలీసుల చేతికి కొత్త అస్త్రం..! కృత్రిమ మేధతో సోషల్​ మీడియాపై నిఘా..

సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపటానికి హైదరాబాద్ పోలీసులు సరికొత్త అస్త్రం ‘సాక్ ఐ’ని సమకూర్చుకున్నారు. ఏఐ ఆధారితంగా పని చేసే దీని ద్వారా సోషల్ మీడియాలో జనం మధ్య విభేధాలు రెచ్చగొట్టేలా…వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీసేలా పోస్టులు పెట్టే వారిపై నిరంతర నిఘా పెట్టటంతోపాటు వారిపై చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ విభాగం రూపొందించిన సాక్ ఐ గురించి కమిషనర్ వీ.సీ.సజ్జనార్ వివరాలు తెలియచేస్తూ గతంలో సోషల్…

TELANGANA

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ‘ఎస్ఐఆర్’.. జూన్‌ 15 నుంచి ప్రక్రియ షురూ..

తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన మీడియాతో పంచుకున్నారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు.   ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు ఇస్తారని…

TELANGANA

బండి సంజయ్ సంచలన ప్రకటన..! నా కుమారుడ్ని పోలీసులకు అప్పగించాను..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ స్వయంగా వెల్లడించారు. ఈ కేసులో చట్ట ప్రకారం విచారణకు సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.   ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. “చట్టం ముందు నా కుమారుడు అయినా, సామాన్యుడు అయినా అందరూ సమానమే. పోలీసులపై ఉన్న గౌరవంతోనే భగీరథ్‌ను అప్పగించాను.…

TELANGANA

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.   ఆసుపత్రికి చేరుకున్న నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించింది. శకుంతల గారి గుండెకు స్టంట్ వేసి, ప్రస్తుతం ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.  …

TELANGANA

బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి..

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కిందిస్థాయి నుంచి పైకి వచ్చారని, కుమారుడి కారణంగా ఆయనకు తలవంపులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసుపై ముఖ్యమంత్రి స్పందించారు. బండి భగీరథ్ పారిపోవడం తప్పని స్పష్టం చేశారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు.   అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని,…

TELANGANA

బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం..!

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక మైనరా? కాదా? అన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో.. దానిపై రీ-వెరిఫికేషన్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం మధ్యంతర బెయిల్ పై తీర్పును రేపు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.   మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్టు చేయవచ్చన్న…

TELANGANA

తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ..!

తెలంగాణలో వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. రోడ్లపై అడ్డగోలుగా వాహనాలు నిలపడం, రోజుల తరబడి వదిలేయడం వంటి చర్యలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వాహనదారుల జేబుకు చిల్లు పడటమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాన్ని…

TELANGANA

బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా..! కేటీఆర్ తీవ్ర విమర్శలు..?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాలను కోరుతున్న బీజేపీ.. తమ వారి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పోక్సో చట్టం ఒక్కటే అయినప్పటికీ కేంద్రమంత్రుల పిల్లలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో…