తెలంగాణకు కొత్తగా 7 నవోదయ స్కూళ్లు..!
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కొత్తగా మరో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2024 డిసెంబర్ లోనే.. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లిభించింది. అయితే ఇప్పుడు పరిపాలనాపరమైన అనుమతులు ఖరారయ్యాయి. ఈ నవోదయ విద్యాలయాల మంజూరుతో రాష్ట్రంలో మరింత నాణ్యమైన విద్య పిల్లలకు…