గ్రూప్-1 ఫలితాల రద్దుపై సస్పెన్స్: ఫిబ్రవరి 5కి తీర్పును వాయిదా వేసిన హైకోర్టు!
తెలంగాణలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల చెల్లుబాటుపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో తుది తీర్పును ఫిబ్రవరి 5, 2026న వెల్లడించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. వాస్తవానికి ఈరోజే (జనవరి 22) తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ, తీర్పు కాపీ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ వాయిదా వేసింది. గ్రూప్-1 మెయిన్స్…

