TELANGANA

TELANGANA

దయచేసి బీసీల రిజర్వేషన్లను అడ్డుకోకండి : మంత్రి పొన్నం..

మంత్రి పొన్నం ప్రభాకర్ బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో.. స్పష్టమైన హామీ ఇచ్చారు. బలహీన వర్గాల నోటి కాడి ముద్ద లాగవద్దు అంటూ ఆయన ప్రతిపక్షాలకు సందేశం పంపారు. స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం రిజర్వేషన్లతోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.   రిజర్వేషన్లపై ప్రభుత్వం దృఢ సంకల్పం   పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో EWS వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితిలో బీసీలకు 42…

TELANGANA

బీసీ రిజర్వేషన్ జీవో రద్దు పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అంగీకారం..

బీసీ రిజర్వేషన్ జీవో రద్దును కోరుతూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. బీసీ రిజర్వేషన్లపై మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.   బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు…

TELANGANA

కాంగ్రెస్‌కు షాక్.. తిరిగి బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప..

సిర్పూర్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కోనేరు కోనప్పతో పాటు ఆయన సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.   2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఆర్ఎస్…

TELANGANA

తెలంగాణలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తులు..

తెలంగాణ‌లో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-27 సంవత్సరాలకు గాను రెండేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేసేందుకు ఆబ్కారీ శాఖ గురువారం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ ప్రక్రియ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ప్రస్తుత దుకాణాల లైసెన్సు గడువు ఈ ఏడాది నవంబర్‌ 30తో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.   ఆబ్కారీ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు…

TELANGANA

బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు.. పిటిషనర్లపై ఆగ్రహం..

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్లపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు…

TELANGANA

గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్‌సీ..

రాష్ట్రంలోని 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీ‌పీఎస్‌సీ) నిన్న అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో నియామక ప్రక్రియ కొనసాగించేందుకు మార్గం సుగమం కావడంతో, కమిషన్ తుది ఎంపికల జాబితాను విడుదల చేసింది.   కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 563 ఖాళీలకు గాను 562 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్‌హెల్డ్‌…

TELANGANA

గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు..

తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 పరీక్షలు ఇప్పటికే ఎన్నో వివాదాలకు, న్యాయపరమైన ఇబ్బందులకు కారణమవుతున్నాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ.. మరోసారి హైకోర్టులో అప్పీల్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ముఖ్య న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం స్వీకరించడం కీలకంగా మారింది.   సింగిల్ బెంచ్ తీర్పు   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ఏడాది మార్చి 10న గ్రూప్-1…

TELANGANA

తెలంగాణలోని ఆ మండలంలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే..!

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ప్రకటించగా, ఆయా గ్రామాల గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.   మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవని 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై 2013లో గిరిజన సంఘాలు…

TELANGANA

పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లభిస్తుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: హరీశ్ రావు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో మాజీ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలని సూచించారు.   ఎన్నికల సమయంలో…

TELANGANA

రాజీనామా పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెన్సేషనల్ కామెంట్స్..!

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీల అంశం ముగిశాక తన ఎమ్మెల్సీ రాజీనామా గురించి ఆలోచిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకి రాలేదని.. కావాలనే కాంగ్రెస్ బయటికి పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   సీఎం రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి..   కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తామంటే ఒప్పుకుంటామని అన్నారు.…