TELANGANA

TELANGANA

తెలంగాణకు కొత్తగా 7 నవోదయ స్కూళ్లు..!

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కొత్తగా మరో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2024 డిసెంబర్ లోనే.. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లిభించింది. అయితే ఇప్పుడు పరిపాలనాపరమైన అనుమతులు ఖరారయ్యాయి. ఈ నవోదయ విద్యాలయాల మంజూరుతో రాష్ట్రంలో మరింత నాణ్యమైన విద్య పిల్లలకు…

TELANGANA

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త తెలిపారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి వివరిస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. “ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు విడతల వారీగా రూ. 5 లక్షలు అందజేస్తున్నాం” అని మంత్రి…

TELANGANA

పంచాయతీ ఎన్నికలు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన ప్రకటన ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.   శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, “రాబోయే జూలై నెలలో సర్పంచ్…

TELANGANA

చార్మినార్, ఫలక్‌నుమా వద్ద మెట్రో పనులకు హై కోర్టు బ్రేక్..!

హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు వారసత్వ కట్టడాల వద్ద అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.   హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా కారిడార్-6 పనులను వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించి ఎలాంటి అధ్యయనం…

TELANGANA

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ ఇకపై ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.   ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే, ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం మూడేళ్ల వయసు నుంచే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి ప్రీ…

TELANGANA

కొత్త మంత్రులు వివేక్, లక్ష్మణ్, శ్రీహరికి శాఖలు ఖరారు చేసిన సీఎం రేవంత్..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   కేటాయించిన శాఖల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్‌కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు.…

TELANGANA

మిల్లెట్స్ హబ్‌గా హైదరాబాద్.. గ్లోబల్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ – భారత సిరిధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) ప్రాంగణంలో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’కు ఆయన శంకుస్థాపన చేశారు.   సిరిధాన్యాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, శిక్షణతో పాటు వాటి ప్రాచుర్యం కల్పించే దిశగా ఈ కేంద్రం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను మరింతగా పెంపొందించేందుకు ఈ…

TELANGANA

‘కాళేశ్వరం’ మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలచిపోయేది: కేటీఆర్..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేవలం కేసీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వ వైఖరిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు…

TELANGANA

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్న రాజాసింగ్..! మరోసారి..

సొంత పార్టీ నాయకుడినే లక్ష్యంగా చేసుకుని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో మరోసారి పరోక్షంగా కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.   హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..…

TELANGANA

మంత్రి పదవి దక్కకపోవడంపై… మల్ రెడ్డి ఏమంటున్నారంటే…!

తెలంగాణలో నిన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది. అనేక మంది మంత్రి పదవుల కోసం ప్రయత్నించినప్పటికీ, ముగ్గురికే అవకాశం లభించింది. సీనియర్లను కాదని తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అడ్డూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరికి, గతంలో ఎంపీగా పనిచేసిన వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.   ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని పార్టీ…