TELANGANA

TELANGANA

తెలంగాణలో వాహనదారులకు షాక్..!

తమకు ఇష్టమైన వాహనం కొనుగోలు చేసిన తర్వాత, దానికో ఫ్యాన్సీ నంబర్ కోసం వేలంలో పోటీ పడేవారికి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో రవాణా శాఖకు ఏటా రూ. 100 కోట్లకు పైగా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు…

TELANGANA

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు..! బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ..!

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సిఎం రేవంత్ రెడ్డి.. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క కార్పొరేషన్ పై దృష్టి పెట్టడం అరుదు. అయితే అక్కడ కాంగ్రెస్ ఎగురవేయాలని.. పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో బిజెపితో పాటు బీఆర్ఎస్ గట్టిగా ఉంది. గత రెండు సార్లు మేయర్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో.. మేయర్ సీటు సాధించాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారంట. అయితే అక్కడ బలమైన నేత…

TELANGANA

సెమీకండక్టర్ ప్రాజెక్టుపై తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది: శ్రీధర్ బాబు..

సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు అవమానకరంగా ఉన్నాయని చెప్పారు.   కేంద్రం విధానాలను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఇలాంటి నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రైమ్ లొకేషన్…

TELANGANA

రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, సెమీకండక్టర్, రక్షణ రంగ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రూ.1.5 లక్షల కోట్లతో హైదరాబాద్‌ను అద్భుత నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి ఆధునిక ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక…

TELANGANA

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.   కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి గువ్వల బాలరాజు ఏ పార్టీలో…

TELANGANA

రిటైర్మెంట్ పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క ప్రకటనతో తెరదించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, చివరి వరకు క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. “జపాన్‌లో ప్రజలకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో, నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు” అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   తనకు ఇప్పుడు 73 ఏళ్లని, ఇంక రాజకీయమే వద్దనుకుంటున్నానని మల్లారెడ్డి నిన్న వ్యాఖ్యానించాడం చర్చనీయాంశంగా…

TELANGANA

పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం..! వీడియో వైరల్..

పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణణం నెలకొంది. ప్రచార పర్వంలో టీడీపీ శ్రేణులు వినూత్నంగా ముందుకుపోతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఖైదీల వేషాలు ధరించి, డప్పులు వాయిస్తూ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.   ఈ నెల 12వ తేదీన జరగనున్న జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన ఉపఎన్నికల పోలింగ్ కోసం ఈ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా, “బాబాయిని చంపిన అబ్బాయి…

TELANGANA

చిన్న పట్టణాలకూ ఐటీ… కేసీఆర్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కేటీఆర్..!

చిన్న పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన కృషిని కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.   ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ, “కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టైర్-2 నగరాలకు ఐటీని తీసుకెళ్లడం మా ప్రాధాన్యతగా ఉండేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో…

TELANGANA

హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి..

భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి, హైదరాబాద్‌లోని నీటి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.   హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బుద్ధ నగర్‌తో పాటు పలు లోతట్టు ప్రాంతాలను…

TELANGANA

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ తో దాడి చేసిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే..!

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యక్రమం రసాభాసగా మారింది. రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా అదనపు కలెక్టర్ చూస్తుండగానే ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్‌పై వాటర్ బాటిళ్లు విసిరే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ ఘటనతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   వివరాల్లోకి వెళితే, జిల్లాలోని…