TELANGANA

TELANGANA

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్..

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా?.. సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని హైకోర్టు మండిపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టి అక్కడి హైడ్రా…

TELANGANA

రాష్ట్రానికి కేంద్ర సాయం సున్నా.. పోరాటానికి సిద్దం కావాలని సీఎం పిలుపు..

కేంద్రం నుండి తెలంగాణకు వస్తున్న సాయం శూన్యమని, త్వరలో కేంద్రంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా సీఎం సంచలన కామెంట్స్ చేశారు.   సీఎం మాట్లాడుతూ.. హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లో పని చేశారన్నారు.…

TELANGANA

ప్రయాగ్ రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు మృతి..

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – కారు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రయాగ్ రాజ్- మీర్జాపుర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు వెళ్తున్న ట్రావెల్ బస్సును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి…

TELANGANA

టిడిపికి రెడ్ బుక్..! బిఆర్ఎస్ కు పింక్ బుక్..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశ పాలన సాగిస్తుంది అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కవిత ఫైరయ్యారు. జనగామలో మాట్లాడిన ఆమె తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని ఇంతకింత చెల్లిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో రెడ్ బుక్ లా తెలంగాణలో పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు.   లెక్క చూస్తాం… వదిలిపెట్టం: ఎమ్మెల్సీ కవిత తమ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు…

TELANGANA

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.   సమావేశ నిర్వహణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు,…

TELANGANA

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కులగణన పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. కానీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపడుతున్నట్లు ప్రకటించారు.   ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్…

TELANGANA

కులగణన మరోసారి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై స్పందించిన కేటీఆర్..

కులగణన సర్వే తప్పుల తడకని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీనిని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, కుల గణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.   ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ, అసంపూర్తి…

APTELANGANA

తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్‌..!

తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్‌ నెలకొంది. ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని ఓ ఫౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. 24 గంటల్లో 10 వేల కోళ్లు మృతి చెందినట్లు లెక్కలు వేశారు. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని వెటర్నరీ అధికారులు సూచించారు. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టారు ఫౌల్ట్రీ యజమాని.   మరోవైపు.. గోదావరి జిల్లాల్లో…

TELANGANA

స్థానిక ఎన్నికల షెడ్యూల్ మూహుర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

తెలంగాణ(Telangana)లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల(Local Body) ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. గ్రామ పంచాయితీల(Gramapanchayati)కు కాల పరిమితి ఎప్పుడో ముగియగా, వివిధ కార్పోరేషన్లకు ఇటీవలే ప్రత్యేక అధికారుల్ని నియమించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే.. అనేక విషయాలపై అంతర్గతంగా అనేక చర్చలు, సమావేశాలు నిర్వహించిన అధికారులు.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల(reservations) ఖరారుకు సిద్ధమయ్యారు.   ఇప్పటికే.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister…

TELANGANA

తెలంగాణలో పెరంగున్న బీట్ల ధరలు..!

తెలంగాణ బీర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. 15 శాతం మేరా పెంచుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బీర్ల ధరల పెంపును సిఫారసు చేసింది రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ధరల నిర్ణయ కమిటీ. కమిటీ సిఫారసు మేరకు 15 శాతం ధర పెంచుతున్నట్లు ప్రభుత్వ వెల్లడించించింది.   ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం…