TELANGANA

TELANGANA

కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ బిగ్ అప్డేట్..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం పాలనా పరంగా – రాజకీయంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటికే ప్రభుత్వం విధాన పరం గా ప్రకటన చేసింది. కొత్తగా డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అర్హత పైన నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ..…

TELANGANA

అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..విచారణకు రావాలంటూ ఆదేశాలు..

స్టార్ హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు మరో షాకిచ్చారు. రేపు (మంగళవారం) విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన నటించిన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ…

TELANGANA

అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: అసెంబ్లీలో కేటీఆర్ సవాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ‘రైతు భరోసా’ అంశంపై ఇవాళ (శనివారం) చర్చ కొనసాగుతోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ సవాలు విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాలు విసిరారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని ఆయన ప్రకటించారు.   ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇతర పెద్దలకు కేటీఆర్ ఈ ఛాలెంజ్…

TELANGANA

అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం..

సినీ హీరో అల్లు అర్జున్ పై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అల్లు అర్జున్ మనిషేనా అని ప్రశ్నించిన రేవంత్… ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, థియేటర్ బయట పరిస్థితి బాగోలేదని, మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోకపోతే పరిస్థితి అదుపుతప్పుతుందని డీసీపీ చెప్పినా… సినిమా చూసి వెళతానని అల్లు అర్జున్ చెప్పారని మండిపడ్డారు.   మీరు వెళ్లకపోతే మిమ్మల్ని…

TELANGANA

ఔటర్ లీజుపై ‘సిట్’.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఫీజు వసూలును మహారాష్ట్రకు చెందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కి 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ నిర్ణయంపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక నిర్వహణపై అసెంబ్లీలో…

TELANGANA

క్యాబినెట్ సమావేశంలో 21 అంశాలపై చర్చ..!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. నేటి మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.   గతంలో చేపట్టకుండా నిలిపివేసిన పనులను పునఃపరిశీలిస్తామని చెప్పారు. పరిశీలన తర్వాత ఆయా ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ముఖ్యంగా, అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు నేటి మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి…

TELANGANA

అవినీతి జరిగిందంట… దానిపై ఏసీబీ కేసంట!: కేటీఆర్ ఫైర్..

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో… బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో కుంభ కోణం జరిగిందని లీకులు ఇస్తున్నారని, దమ్ముంటే కార్ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.   2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ రేసుకు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారని వివరించారు. కార్ రేసింగ్…

TELANGANA

నారాయణ స్కూల్‌లో దారుణం.. 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్‌లో ఇటీవల విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హయత్‌నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ రెడ్డిగా గుర్తించారు. విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు…

TELANGANA

కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన..

హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెళ్లో బుల్డోజర్లు పరుగెత్తిస్తున్న హైడ్రా లక్ష్యాలు, అనుసరించనున్న విధివిధానాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడడానికి ముందు నిర్మించుకున్న నివాస స్థలాల జోలికి వెళ్లబోమంటూ ప్రకటించారు. అదే సమయంలో రానున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇంతకీ.. రంగనాథ్ ఏఏ విషయాల్లో స్పష్టతనిచ్చారు. కొంత మందికి ఊరట కలిగించే వార్త ఏంటి అంటే..   మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి మండలంలోని మూసాపేట, ఖైతలాపూర్…

TELANGANA

ఈ-రేసింగ్‌లో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు.. అరెస్ట్‌పై మాట్లాడను: మంత్రి పొంగులేటి..

ఈ-కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారని, అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్‌పై తానేమీ మాట్లాడనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుందన్నారు.   కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… విచారణకు గవర్నర్ అనుమతించిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… ఏసీబీకి తెలియజేస్తారన్నారు. ఈ-కార్ రేసింగ్‌లో చట్ట ప్రకారమే ఏసీబీ దర్యాఫ్తు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.   గవర్నర్…