గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ..
రాష్ట్రంలోని 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిన్న అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో నియామక ప్రక్రియ కొనసాగించేందుకు మార్గం సుగమం కావడంతో, కమిషన్ తుది ఎంపికల జాబితాను విడుదల చేసింది. కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 563 ఖాళీలకు గాను 562 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్హెల్డ్…

