TELANGANA

TELANGANA

విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం..

తెలంగాణలో SPDCL, NPDCL‌తోపాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్-మైనర్ లిప్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ నీటి సరాఫరాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.   ప్రతిపాదనల నేపథ్యంలో ప్రణాళిక సిద్ధం…

TELANGANA

తెలంగాణలో అసమర్థ పాలన కొనసాగుతోంది: కేటీఆర్ విమర్శలు..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   గతంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత మానవత్వం…

TELANGANA

ఎంపీల ఓట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు: కౌశిక్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లను ఆయన బీజేపీకి అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు.   ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ ఘటన: 200 రోజులు దాటినా మృతదేహాలు వెలికితీయరా..? కేటీఆర్ ఫైర్..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం కూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.   “అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రోజులు గడిచినా ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా…

TELANGANA

తెలంగాణ విమోచన దినోత్సవంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీసిన చారిత్రక పోరాట ఘట్టాలను, నాటి ప్రజల త్యాగాలను కళ్లకు కట్టేలా ఈ ఫొటో ప్రదర్శనను తీర్చిదిద్దారు.   ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వమే హైదరాబాద్ విమోచన…

TELANGANA

తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేవలం కేసీఆర్‌కు మాత్రమే దక్కదని, రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయనది ఒక పాత్ర మాత్రమేనని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం వచ్చిందనే వాదనను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.   కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర భయాందోళనల మధ్య బతికారని,…

TELANGANA

గోదావరి పుష్కరాలు-2027.. ఇప్పటినుంచే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్..

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటినుంచే కార్యాచరణను ప్రారంభించింది. ఈ పుష్కరాలను ‘దక్షిణ కుంభమేళా’గా పరిగణించి, భారీ ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.   పుష్కరాలు ప్రారంభం కావడానికి ఇంకా 22 నెలల సమయం ఉన్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక…

TELANGANA

మేడారం పర్యటనకు సీఎం రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ నెల 13, 14 తేదీల్లో ములుగు జిల్లాలోని మేడారాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్వయంగా మేడారాన్ని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు.   గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన   సీఎం పర్యటనలో భాగంగా, మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి రెండు…

TELANGANA

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిని.. పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో.. రైల్వే ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారులు పాల్గొన్నారు.   కీలక అధికారుల హాజరు   ఈ సమీక్ష సమావేశానికి ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్‌పోర్ట్ అండ్ బిల్డింగ్స్ స్పెషల్ సెక్రటరీ…

TELANGANA

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కేటీఆర్ సర్వే..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వే చేయిస్తున్నామని, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నామని, అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉప ఎన్నిక ఉంటుందని చెప్పారు.   మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన…