TELANGANA

TELANGANA

కలెక్టరేట్‌లో కలకలం.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారిణి..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో ఒక మహిళా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి (డీఎఫ్‌ఓ)గా పనిచేస్తున్న ఎం. చరితారెడ్డి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.   ఒక వ్యక్తి తన మత్స్యకార సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం డీఎఫ్‌ఓ చరితారెడ్డిని సంప్రదించారు. అయితే,…

TELANGANA

కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నాయి..!:కేటీఆర్..

కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ సమక్షంలో పినపాక నియోజకవర్గం, మణుగూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు.   ప్రతి రైతూ అప్పటి రోజులే బాగుండేవని చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల…

TELANGANA

బీఆర్ఎస్ కు ఎక్స్ వేదికగా కవిత కౌంటర్..

మాజీ మంత్రి హరీశ్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చింది. నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఆమె ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘సత్యమేవ జయతే… జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.   బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత…

TELANGANA

గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు..! బెండాలపాడులో చారిత్రక ఘట్టం..! ప్రారంభించనున్న సీఎం రేవంత్..

ఏళ్ల తరబడి గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన బెండాలపాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేదిక కానుంది . ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది.   సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్‌లో బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని లబ్ధిదారులైన బచ్చల నర్సమ్మ, బచ్చల…

TELANGANA

వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు.. రంగంలోకి దిగిన సీబీఐ..!

తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారికంగా స్వీకరించింది. ఈ మేరకు ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.   సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను నిందితులుగా…

TELANGANA

కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న కవిత..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.   బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయకముందే, తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత యోచిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్..! అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది..?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది.   “పార్టీ ఎమ్మెల్సీ…

TELANGANA

కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ..

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టడానికి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది.   ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. రేపు ఉదయం…

TELANGANA

చంద్రబాబు, పవన్, కేసీఆర్, జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా… తెలుగువాడికి అవకాశం వచ్చింది: రేవంత్ రెడ్డి..

ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి” అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  …

TELANGANA

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలక సవరణ బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. తీవ్ర వాదోపవాదాల నడుమ తెలంగాణ మున్సిపాలిటీల (మూడవ సవరణ) బిల్లు-2025, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు-2025లను సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది.   అసెంబ్లీ సమావేశాల రెండో రోజున ప్రభుత్వం ఈ రెండు…