కలెక్టరేట్లో కలకలం.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారిణి..
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఒక మహిళా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి (డీఎఫ్ఓ)గా పనిచేస్తున్న ఎం. చరితారెడ్డి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి తన మత్స్యకార సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం డీఎఫ్ఓ చరితారెడ్డిని సంప్రదించారు. అయితే,…

